తెలంగాణ

గోదావరిలో గల్లంతైన ఆరుగురు యువకులు.. పోలీసులు గాలింపు!

క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ :- జయశంకర్ జిల్లా మహాదేవ్ పూర్ మండలంలోని అంబట్ పల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అంబట్ పల్లి గ్రామానికి చెందిన నలుగురు యువకులు కొర్లకుంట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు గ్రామంలో జరిగిన శుభకార్యానికి హాజరై కార్యక్రమం అనంతరం (శనివారం సాయంత్రం..) గోదావరిలో స్నానానికి వెళ్లగా గల్లంతయ్యారు. గల్లంతయిన వారు వివరాలు… మధుసూదన్ ( 18) శివ మనోజ్ (15), తోకరి రాజకుమారుడు తోకరి రక్షిత (13), కర్నాల సమ్మయ్య కుమారుడు కర్ణాల సాగర్ (16) కొర్లకుంట గ్రామానికి చెందిన పండు(18), రాహుల్ (19) కార్యక్రమం అనంతరం స్నానానికి వెళ్లి గల్లంతయినట్టు స్థానికుల సమాచారం. ఘటన స్థలాన్ని చేరుకున్న మహాదేవుడు ఎస్సై పవన్ కుమార్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. మరియూ గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు… ఎమ్మెల్యే మాగంటి మృతి!..

డిప్యూ సీఎం గొప్ప మనసు.. తన చార్టెడ్ ప్లేన్ లో పేషెంట్ ఆసుప్రతికి తరలింపు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button