ఆంధ్ర ప్రదేశ్

“తల్లికి వందనం”.. విద్యార్థుల్లో ఉత్సాహం!.. చంద్రబాబుకు సలాం కొడుతున్న జనం?

క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఉన్నారు. తాజాగా ఎలక్షన్లో సమయంలో ఇచ్చిన పథకాల హామీలలో నిన్న ‘తల్లికి వందనం’ పథకం కింద.. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి 15వేల రూపాయల చొప్పున తల్లిదండ్రుల ఎకౌంట్లో డబ్బులు వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికీ ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా ఒక కుటుంబంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి ఈ పథకం వర్తిస్తుంది. నీటి నుంచి అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమవుతూ ఉన్నాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఒకే కుటుంబంలో నలుగురు విద్యార్థులు ఉండగా వారందరికీ కూడా మొత్తం కలిపి 52,000 ను ప్రభుత్వం వారి తల్లిదండ్రుల ఖాతాల్లో డబ్బులను జమ చేసింది. దీంతో ఆ కుటుంబ ఆనందం అంతా ఇంతా కాదు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు అకౌంట్ లో పడుతున్న తీరును ప్రతి ఒక్క కుటుంబం కూడా సంతోషంలో మునిగి తేలుతుంది. కాగా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా కేవలం ఒక పిల్లవాడికి మాత్రమే అమ్మ ఒడి కింద 15 వేల రూపాయలు జమ చేసేవారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఒక్కొక్కరికి 15వేల రూపాయలు చొప్పున అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నారు. దీంతో విద్యార్థుల్లో ఉత్సాహంతో పాటుగా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు భవిష్యత్తు బంగారు బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 32 లక్షల మందికి నేడు సొమ్ములు వారి వారి ఖాతాలలో పడుతున్నాయి. మరి కొంతమందికి వివిధ కారణాల వలన కొంచెం ఆలస్యం అవుతున్నట్లు బ్యాంకు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల సమయంలో చెప్పిన విధంగానే ఒక్కొక్క విద్యార్థికి 15వేల రూపాయలు అందించడం వల్ల… వారికి కావాల్సినటువంటి పుస్తకాలు మరియు దుస్తులు కొనుగోలు చేసేందుకు చాలా సులువంగా మారింది అని తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఓడిపోయి ఏడాది అవుతుంది… మరి జనాల్లో వైసీపీకి ఆదరణ దక్కిందా? లేదా?

కొత్త టెక్నాలజీలు ఆరోగ్యానికి హానికరమా !… ఎక్కువసేపు ఫోన్ చూస్తున్నారా?. అయితే ఇది మీకోసమే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button