
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఆయన పేరు ట్రెండింగ్ లో నిలిచింది. అయితే రాహుల్ గాంధీ ట్రెండింగ్ లో నిలిచింది మన దేశంలో కాదు.. మన బద్దు శత్రు దేశమైన పాకిస్తాన్ లో. భారత్ తో పాకిస్తాన్ యుద్దం జరిగిన సమయంలో పాకిస్తాన్ లో రాహుల్ గాంధీ ట్రెండింగ్ లో నిలవడం సంచలనంగా మారింది. రెండు రోజులుగా పాకిస్తాన్ మీడియాలో రాహుల్ గాంధీనే టాప్ లో ఉన్నారు. వార్తలన్ని ఆయన చుట్టే తిరుగుతున్నాయి. రాహుల్ గాంధీని హీరోలా ప్రమోట్ చేస్తున్నాయి పాకిస్తాన్ మీడియా సంస్థలు.
ఆపరేషన్ సిందూర్, మోదీ ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ పార్టీ పలు విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న కామెంట్స్ పాకిస్తాన్లో ట్రెండింగ్ అవుతున్నాయి. మొన్న దేశ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. ఆపరేషన్ సింధూర్లో ఎన్ని విమానాలను కోల్పోయామో తెలపాలని కేంద్ర మంత్రి జయశంకర్ను కోరారు. రాహుల్ కామెంట్లను తమను అనుకూలంగా మలుచుకుని వార్తలు ప్రసారం చేస్తోంది పాకిస్తాన్ మీడియా. మోడీ ప్రభుత్వంపై ఇండియాలోనే వ్యతిరేకత వస్తుందని చెబుతున్నాయి. రాహుల్ గాంధీ ప్రశ్నలకు దమ్ముంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పాలని డిమాండ్ చేస్తూ..పదేపదే రాహుల్ కామెంట్లను ప్రస్తావిస్తున్నాయి.
ఇక AICC అధ్యక్షుడు సైతం పాకిస్తాన్ తో భారత్ చిన్నపాటి యుద్ధాలు చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పహల్గాంలో కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించకపోవడం వల్లే ఉగ్రవాదుల చేతుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారన్నారని వ్యాఖ్యానించారు మల్లిఖార్జున ఖర్గే . పాకిస్తాన్కు మద్దతు తెలిపేలా కాంగ్రెస్ వ్యాఖ్యలు ఉన్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. వారి తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు.