Monday, March 16, 2026
Homeతెలంగాణనిరుపేదలకు వలస కూలీలకు హారం అందించడం ఎంతో తృప్తినిస్తుంది

నిరుపేదలకు వలస కూలీలకు హారం అందించడం ఎంతో తృప్తినిస్తుంది

క్రైమ్ మిర్రర్, శంకర్ పల్లి :-నిరుపేదలకు వలస కూలీలకు అన్నదానం చేయడం ఎంతో సంతృప్తినిస్తుందని శంకర్పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్ నరేష్ కుమార్ పేర్కొన్నారు. అక్షయ తృతీయ సందర్భంగా బుధవారం రాత్రి శంకర్ పల్లి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు, వలస కూలీలకు, రైల్వే స్టేషన్ అనాథలకు, భోజనంతోపాటు మామిడిపండ్లను అందించడం జరిగింది. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ సేవా ఫౌండేషన్ శ్రేయోభిలాషులైన శివ అశ్విని మరియు విష్ణు ఈ ఆహారాన్ని ఇవ్వడం వారి మానవత్వాన్ని చాటుతు ఉందన్నారు. ఆకలితో బాధపడుతున్న వారికి ప్రతి ఒక్కరు తమకు నచ్చిన విధంగా కార్యక్రమాలు చేయాలని నరేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు జయరాం రెడ్డి, సే ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి వివేంద్ర చారి, సభ్యులు రాజు, కరాటే రవి, టీచర్ ఉదయ్ కిరణ్, వెంకట్ రెడ్డి, అశ్విని, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

మరో నాలుగు రోజులు వర్షాలు!…

పసలేదు కేసీఆర్‌ ప్రసంగం ఆత్మస్తుతి, పరనింద… కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోయడానికే సభ?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments