
-
2వేల పేజీల నివేదిక ఇచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం
-
మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు నిర్థారణ
-
తీర్పు వెలువరించిన బెంగళూరు ప్రత్యేక కోర్టు
-
కోర్టు హాల్లోనే బోరున విలపించిన ప్రజ్వల్ రేవణ్ణ
-
ప్రజ్వల్కు రేపు శిక్ష ఖరారు చేయనున్న న్యాయస్థానం
క్రైమ్మిర్రర్, బెంగళూరు: జేడీఎస్ అధినేత దేవెగౌడ మనవడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం కేసులో దోషిగా తేలాడు. రేప్ కేసులో ప్రజ్వల్ను దోషిగా తేలుస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో కోర్టు హాల్లోనే ప్రజ్వల్ బోరున విలపించాడు.
ప్రజ్వల్ రేవణ్ణ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఘటన మొత్తాన్ని రికార్డ్ చేసి బెదిరించాడని గత ఏడాది బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేసిన ప్రత్యేక బృందం 2వేల పేజీల నివేదికను కోర్టుకు అందజేసింది. విచారణలో భాగంగా 123 ఆధారాలను సేకరించింది. ఫోరెన్సిక్ ఆధారాలనూ పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. రేపు శిక్షణకు ఖరారు చేయనుంది కోర్టు.
గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు కర్ణాటకలో సెక్స్ కుంభకోణం సంచలనం సృష్టించింది. దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ తనపై అత్యాచారం చేసి, బెదిరించాడని ఓ మహిళ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టించాయి. బెంగళూరులోని తన నివాసంలో ప్రజ్వల్ తనపై అత్యాచారం చేశాడని, వీడియో తీసి బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపింది. తన తల్లి సెల్కు వీడియో కాల్ చేసి బట్టలు విప్పించేవాడని, ఎవరికైనా చెబితే నీ తల్లిని, నిన్ను చంపేస్తానని బెదిరించాడని బట్టబయలు చేసింది. ప్రజ్వల్ తనతో పాటు చాలామందిని ఇలాగే చేశాడని పేర్కొంది.
Read Also: