Wednesday, March 4, 2026
Homeఅంతర్జాతీయంచైనాకు ప్రధాని మోడీ.. గాల్వాన్ ఘటన తర్వాత తొలిసారి!

చైనాకు ప్రధాని మోడీ.. గాల్వాన్ ఘటన తర్వాత తొలిసారి!

PM Modi China Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగష్టులో చైనాకు వెళ్లనున్నారు. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉన్నత స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. 2020లో తూర్పు లద్దాఖ్‌ లోని గాల్వాన్ లోయలో సైనికుల మధ్య ఘర్షణతో చైనా-భారత్ మధ్య దౌత్య సంబంధాలు చాలా వరకు నిలిచిపోయాయ. ఆ ఘటన తర్వాత తొలిసారి మోడీ చైనాకు వెళ్తున్నారు. అయితే, ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడికానున్నారు.

తియాంజిన్ వేదికగా శిఖరాగ్ర సమావేశాలు

చైనాలోని తియాంజిన్ వేదికగా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు జరగనుంది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ఈ సమావేశాలను నిర్వహిస్తారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో పాటు ఎస్‌సీఏ సభ్య దేశాల అధినేతలు ఈ సదస్సులో పాల్గొననున్నారు.

చైనా అధ్యక్షుడితో ద్వైపాక్షిక మోడీ చర్చలు

ఇక చైనా పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు జిన్‌ పింగ్‌ తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు దేశాధినేతలు చివరిసారిగా 2024 అక్టోబర్‌ లో రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో కలిశారు. మోడీ  పర్యటనకు ముందుగా చైనాలో భారత విదేశాంగ మంత్రి జైంశర్ పర్యటించారు. ఎస్‌సీఓ సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో పహల్గాం ఉగ్రదాడి గురించి ఆయన ప్రస్తావించారు. ఆ తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ తోనూ సమావేశం అయ్యారు. గత ఐదేళ్లలో జైశంకర్ చైనాలో ఆయన పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Read Also: భారత రక్షణ వ్యవస్థ.. సీడీఎస్ అనిల్ సంచలన వ్యాఖ్యలు!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments