Tuesday, March 3, 2026
Homeఅంతర్జాతీయంఏడేళ్ల తర్వాత చైనాకు ప్రధాని మోడీ.. ఘన స్వాగతం పలికిన డ్రాగన్ కంట్రీ!

ఏడేళ్ల తర్వాత చైనాకు ప్రధాని మోడీ.. ఘన స్వాగతం పలికిన డ్రాగన్ కంట్రీ!

PM Modi China Visit:  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చైనాలో అడుగు పెట్టారు. దాదాపు ఏడేళ్ల తర్వాత బీజింగ్‌ కు చేరుకున్నారు. టియాంజిన్‌ ఎయిర్‌ పోర్ట్‌ లో ప్రధానికి రెడ్‌ కార్పెట్‌ వేసి అక్కడి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 1 వరకూ.. రెండు రోజుల పాటూ చైనాలో ప్రధాని పర్యటించనున్నారు. టియాంజిన్‌ లో జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ పర్యటన సందర్భంగా తొలిరోజు చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ తో  మోడీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. భారత్‌ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అదనపు సుంకాల వేళ ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఏడేళ్ల తర్వాత చైనాకు మోడీ

అటు ప్రధాని మోడీ ఏడేళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్నారు. చివరిసారిగా 2018లో పర్యటించారు. ఆ తర్వాత చైనా  అధ్యక్షుడు 2019లో భారత్‌లో పర్యటించారు. ఆ తర్వాత 2020లో లద్దాఖ్‌ సరిహద్దుల్లో భారత్‌-చైనా సైనికుల మధ్య ఘర్షణతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గత అక్టోబర్‌ లో జరిగిన బ్రిక్స్‌ సదస్సులో ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ జరిగింది. నేరుగా విమాన సర్వీసులు, కైలాస్‌ మానసరోవర్‌ యాత్రను పునరుద్ధరించేందుకు ఈ సంవత్సరం జూన్‌ లో ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ ఎస్‌సీఓ సమ్మిట్‌ కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సహా మధ్య, పశ్చిమ, దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలకు చెందిన దాదాపు 20 మందికిపైగా ప్రపంచ నాయకులు పాల్గొననున్నారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments