ఆంధ్ర ప్రదేశ్రాజకీయం

Pawan kalyan: హైకోర్టును ఆశ్రయించిన డిప్యూటీ సీఎం

Pawan kalyan: దేశవ్యాప్తంగా సోషల్ మీడియా నియంత్రణ, ఫేక్ కంటెంట్ పై చట్టపరమైన చర్చలు వేడెక్కుతున్న సమయంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం మరో కీలక మలుపుగా నిలిచింది.

Pawan kalyan: దేశవ్యాప్తంగా సోషల్ మీడియా నియంత్రణ, ఫేక్ కంటెంట్ పై చట్టపరమైన చర్చలు వేడెక్కుతున్న సమయంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం మరో కీలక మలుపుగా నిలిచింది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారం, వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగించే విధంగా రూపొందిస్తున్న డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు వ్యాఖ్యల రూపంలో వైరల్ అవుతున్న కోట్స్, అలాగే దారితప్పించే ప్రచారాలపై ఆపద్ధర్మంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుకోవడం ప్రతి పౌరుడి హక్కు అని, అలాంటి హక్కులపై ఎవరికీ దాడి చేసే అధికారం లేదని పిటిషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

జనసేన అధినేత తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ ఢిల్లీ హైకోర్టులో సమగ్ర పిటిషన్ వేశారు. డిజిటల్ ప్రపంచంలో అతి పెద్ద సంస్థలైన మెటా, గూగుల్, ఎక్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఇటీవల పెరిగిన ఉల్లంఘనలను అరికట్టడంలో విఫలమవుతున్నాయని, తప్పుడు ప్రచారాలను ఆపేందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆయన వాదించారు. ప్రత్యేకించి AI ఆధారిత డీప్‌ఫేక్‌ వీడియోలకు పెరుగుతున్న డిమాండ్‌తో, ఈ సమస్య మరింత ప్రమాదకర దశకు చేరిందని తెలిపారు.

ప్రాథమిక విచారణ అనంతరం ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్‌లో సీరియస్ అంశాలు ఉన్నాయని గుర్తించి కీలక ఆదేశాలు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ పై గతంలో జరిగిన సోషల్ మీడియా ఉల్లంఘనలన్నింటికీ సంబంధించిన పూర్తి వివరాలు, సంబంధించిన పోస్టులు, లింకులు, స్క్రీన్‌షాట్లు, దుష్ప్రచారానికి ఉపయోగించిన కంటెంట్ మొత్తం ఒక వారం వ్యవధిలో కోర్టుకు సమర్పించాల్సిందిగా ఆదేశించింది. ఇదే సమయంలో సోషల్ మీడియా సంస్థలకూ తగిన హెచ్చరికలు జారీ చేసి, వ్యక్తిత్వ హక్కులను రక్షించడం తమ బాధ్యత అని స్పష్టం చేసింది.

ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేస్తూ అప్పటికి పిటిషనర్, సోషల్ మీడియా కంపెనీలు తమ ఆర్గ్యుమెంట్లకు సంబంధించిన సమగ్ర నివేదికలను సమర్పించాల్సిందేనని ధర్మాసనం తెలియజేసింది. పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులు డిజిటల్ మీడియా యుగంలో ఎదుర్కొంటున్న ఇలాంటి పరిస్థితులు కేవలం రాజకీయ నేతలకే పరిమితం కావనే సమస్య కాదని, సినీ నటులు నుండి సామాన్య ప్రజల వరకు అందరి జీవితాలను ప్రభావితం చేస్తోందని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

అంతేకాకుండా, AI ఆధారిత వీడియో ఎడిటింగ్ టూల్స్ విస్తృతంగా అందుబాటులోకి రావడం వల్ల, ఎవరి ముఖాన్ని ఉపయోగించి ఎవరి గొంతుతోనైనా నకిలీ వీడియోలు తయారు చేసే ధోరణి ప్రమాదకరంగా పెరిగిందని వారు వివరించారు. దీనితో వ్యక్తిగత ప్రతిష్ఠపైనే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

ALSO READ: Health Tips: మలబద్ధకం ఎక్కువగా ఉందా..? అయితే ఇలా చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button