Tuesday, March 17, 2026
HomeజాతీయంShashi Tharoor: రాహుల్‌ తో శశిథరూర్ భేటీ.. ఆ ఊహాగానాలకు బ్రేక్ పడినట్టేనా?

Shashi Tharoor: రాహుల్‌ తో శశిథరూర్ భేటీ.. ఆ ఊహాగానాలకు బ్రేక్ పడినట్టేనా?

Shashi Tharoor Meets Rahul Gandhi: కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారంటూ కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌‌పై కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నారు.   ఆయనపై ప్రధాని మోడీ స్వయంగా ప్రశంసలు సైతం కురిపించారు. రేపు మాపో ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారనే ప్రచారమూ జోరందుకుంది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా పార్లమెంట్ ప్రాంగణంలో ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గేతో పాటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో శశిథరూర్ సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు వారితో ఈ భేటీ కొనసాగింది.

గత కొంతకాలంగా బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు

గతేడాది పహల్గాం ఉగ్రదాడి అనంతరం కేంద్రం.. పాకిస్థాన్‌లోని ఉగ్ర సంస్థల లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. దీంతో మోడీ ప్రభుత్వంపై శశిథరూర్ ప్రశంసల జల్లు కురిపించారు. అలాగే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ నిర్వహించాల్సి వచ్చిందంటూ ప్రపంచంలోని వివిధ దేశాలకు తెలియజేయాలని కేంద్రం నిర్ణయించింది. అందుకు ఎంపీలతో కూడిన పలు ప్రతినిధి బృందాలను ఆయా దేశాలకు పంపాలని భావించింది. ఆ బృందంలో సభ్యులుగా మీ పార్టీ ఎంపీలను ఎంపిక చేసి జాబితా ఇవ్వాలంటూ కాంగ్రెస్‌కు సూచించింది. పలువురు ఎంపీలతో కూడిన జాబితాను కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ అందించింది.

కాంగ్రెస్ శశి థరూర్ పేరును చేర్చకపోయినా..

ఇక జాబితాలో శశిథరూర్ పేరును కాంగ్రెస్ పార్టీ చేర్చలేదు. కానీ ఒక ప్రతినిధి బృందంలో శశిథరూర్ పేరును కేంద్రం చేర్చింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను ఎలా ఎంపిక చేస్తారంటూ కేంద్రం వైఖరిని ఆ పార్టీ నిలదీసింది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో శశిథరూర్ పాత్ర దాదాపుగా బలహీనంగా మారింది. బీజేపీలోకి శశిథరూర్ వెళ్లిపోతున్నారంటూ ఒక ప్రచారం సైతం ఊపందుకొంది. అలాంటి వేళ పార్టీ అగ్రనేతలు రాహుల్, మల్లికార్జున ఖర్గేతో శశిథరూర్ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ భేటీలో పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో వారిద్దరికి ఎంపీ శశిథరూర్ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments