తెలంగాణ

పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్..

చండూరు, క్రైమ్ మిర్రర్: చండూరు మండలంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి సైదులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన గతంలో చండూరు గ్రామపంచాయతీగా ఉన్నప్పుడు కార్యదర్శిగా పనిచేశారు. అయితే కొందరు జర్నలిస్టులకు ఇటీవల కాలంలో పాత తేదీల మీద తప్పుడు యాజమాన్య ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. రైతు సేవా సహకార సంఘం డైరెక్టర్ కట్ట బిక్షం  ఈ విషయమై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. డిఎల్పిఓ  విచారణ నివేదికను కలెక్టర్కు సమర్పించారు. దీనితో  కార్యదర్శి సైదులును  జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో సదరు జర్నలిస్టులు చేసుకున్న ప్లాట్ల  రిజిస్ట్రేషన్ లను  చండూరు ఆర్డివో హోల్డింగ్ లో పెట్టించారు.

కాగా  లక్షల రూపాయలు విలువ చేసే ప్లాట్ లను వెంటనే మున్సిపాలిటీ వారు స్వాధీనపర్చుకొని  ప్రజాప్రయోజనాలకు ఉపయోగించాలని,  అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రైతు సేవా సహకార సంఘం డైరెక్టర్ కట్ట బిక్షం డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ అక్రమ రిజిస్ట్రేషన్ ల బాగోతం పై  ఉన్నత అధికారుల ద్వారా విచారణ  చేయించాలని  స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి .. 

  1. బెల్టు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్సై సురేష్
  2. చండూరు రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
  3. కేసీఆర్ పై కేసు పెట్టిన వ్యక్తి దారుణ హత్య
  4. హైడ్రా కు హెచ్చరికలు!.. మరోసారి అలా జరిగితే హైడ్రా ను రద్దు చేస్తాం: హై కోర్ట్

Originally posted 2024-07-16 08:52:51.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button