Tuesday, March 17, 2026
Homeఅంతర్జాతీయంSanskrit Course: పాక్ యూనివర్సిటీలో సంస్కృతం కోర్సు.. ఎందుకు ఈ నిర్ణయం?

Sanskrit Course: పాక్ యూనివర్సిటీలో సంస్కృతం కోర్సు.. ఎందుకు ఈ నిర్ణయం?

Sanskrit Course In Pak: పాక్‌ లో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. దేశ విభజన తరువాత తొలిసారిగా లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌ లో సంస్కృతం కోర్సును ప్రారంభించారు. ఇందులో భాగంగా విద్యార్థులు మహాభారతం, భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలను నేర్చుకుంటున్నారు. ఈ కోర్సును ఫోర్మన్ క్రిస్టియన్ కాలేజ్ ప్రొఫెసర్ షహీద్ రషీద్ నడిపిస్తున్నారు.  ముందుండి నడిపిస్తున్నారు.

మూడు నెలల పాటు వర్క్ షాప్

మొదట్లో సంస్కృతంపై మూడు నెలల పాటు నిర్వహించిన వర్క్‌ షాపునకు మంచి స్పందన రావడంతో పూర్తిస్థాయి యూనివర్సిటీ కోర్సును ప్రారంభించామని ప్రొఫెసర్ షహీద్ రషీద్ తెలిపారు. 2027 నుంచి ఏడాది కాల వ్యవధి గల పూర్తిస్థాయి కోర్సును కూడా అందించే యోచనలో ఉన్నామని అన్నారు. దక్షిణాసియా ఉమ్మడి సాహిత్య చరిత్ర తెలుసుకునే దిశగా ఇది కీలక ముందడుగు అని వ్యాఖ్యానించారు. సంస్కృతం అంటే ఏదో ఒక మతానికి సంబంధించినది కాదని, ఈ ప్రాంత ఉమ్మడి సాంస్కృతిక చరిత్ర అని అన్నారు.

మొదట్లో కాస్త ఇబ్బంది అయినప్పటికీ..

విద్యార్థులు తొలుత సంస్కృతం నేర్చుకోవడంలో కాస్త ఇబ్బంది పడ్డారని ప్రొఫెసర్ రషీద్ చెప్పారు. కానీ భాష వ్యాకరణం ఒకసారి అర్థమయ్యాక వారిలో మక్కువ పెరిగిందని అన్నారు. ఉర్దూ భాషపై సంస్కృతం ప్రభావాన్ని తెలుసుకుని విద్యార్థులు ఆశ్చర్యపోయారని చెప్పారు. “మేమంతా సంస్కృతం ఎందుకు నేర్చుకోకూడదు. ఈ ప్రాంతాన్ని అంతటినీ ఒక్కటి చేసిన భాష ఇది. సంస్కృత వ్యాకరణాన్ని మొట్టమొదటి సారిగా గ్రంథస్థం చేసిన పాణిని గాంధార రాజ్యంలో ఉండేవారు. ఆయన నివసించిన ప్రాంతం ప్రస్తుతం ఖైబర్ పాఖ్‌తున్‌ఖ్వా ప్రాంతంలో ఉంది” అని చెప్పుకొచ్చారు రషీద్.

వేలాది సంస్కృత దస్త్రాలు

తమ దగ్గర సంస్కృత దస్త్రాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని యూనివర్సిటీలోని గుర్మానీ సెంటర్ డైరెక్టర్ డా. ఉస్మాన్ ఖాస్మీ తెలిపారు. కానీ అధ్యయనకర్తలు వాటిపై ఇప్పటివరకూ దృష్టిసారించలేదని అన్నారు. ఇకపై పరిస్థితి మారుతుందని, రాబోయే 10-15 ఏళ్లల్లో భగవద్గీత, మహాభారతాల గురించి తెలుసుకునే స్కాలర్స్ పాక్‌లో ఉంటారని కూడా చెప్పారు. లాహోర్ యూనివర్సిటీ నిర్ణయం పట్ల ఆ దేశంలోని సనాన ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments