పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మారుతున్న పర్యావరణ పరిస్థితులు కేవలం మనుషులకే కాకుండా మూగజీవాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అందులోనూ కొన్ని సాంప్రదాయ పద్ధతులు మూగజీవాల ప్రాణాలను ప్రమాదంలో పెట్టేస్తున్నాయి. ఇలాంటి సంఘటన విశాఖలో చోటుచేసుకుంది. భూసలు కొట్టే నాగుపామును తరిమికొట్టేందుకు ప్రయత్నించిన సాంప్రదాయ పద్ధతి దాని ప్రాణాలకు పెద్దగా ముప్పు తెచ్చింది. వేడి ఉక్కు, పొగల వాపు వల్ల ఆ నాగుపాము సొమ్మసిల్లిపోయింది. ఈ సమయంలో రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ నాగరాజు చేసిన పని అందరిని ఆశ్చర్యానికి లోనుగా చేశాయి.
వివరాల్లోకి వెళితే.. విశాఖలోని శ్రీహరిపురం ప్రాంతంలో బాలరాజు అనే వ్యక్తి ఇంటి పరిసరాల్లో నాగుపాము సంచరిస్తూ కనిపించింది. భయంతో కుటుంబ సభ్యులు గుండెలు పట్టుకున్న పరిస్థితిలో, ఆ పాము ఇంట్లోని స్క్రాప్ వస్తువుల మధ్య దాగిపోయింది. బయటకు రాకపోవడంతో, ఆ కుటుంబం సాంప్రదాయ పద్ధతిని అనుసరించి కొన్ని వస్తువులను కాల్చి, పొగను పాముకు చేరేలా ప్రయత్నించింది. అయినప్పటికీ పాము బయటకు రాకపోవడంతో నాగరాజుకు సమాచారం అందింది.
పాములను రెస్క్యూ చేయడంలో నైపుణ్యం ఉన్న నాగరాజు రంగంలోకి దిగి, నెమ్మదిగా ఆ నాగుపామును బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాడు. అయితే, ఇప్పటికే మండుతున్న ఎండ, ఉప్పు పొగ కారణంగా పాము సొమ్మసిల్లిపోయింది. దాదాపు ఆరడుగుల పొడవున్న పామును నాగరాజు నెమ్మదిగా పట్టుకుని, సమీప అడవిలో విడిచిపెట్టడానికి ప్రయత్నించాడు. పాము పూర్తిగా తేరకుండా ఉండటంతో, నాగరాజు చల్లటి నీటిని పోసి దాన్ని మెల్లగా మళ్లీ చైతన్యవంతంగా చేశాడు.
చల్లటి నీటిని ఆస్వాదిస్తూ, సేదతీరుతూ పాము నెమ్మదిగా మెల్లగా లేచి పడగ విప్పింది. సాధారణ స్థితికి వచ్చిన తర్వాత నాగరాజు సమీప పొదల్లో ఆ పామును సేఫ్గా విడిచిపెట్టాడు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో కూడా ఆసక్తికరంగా మారింది.
ALSO READ: ఎన్టీఆర్కు ఇష్టమైన కారు ఇప్పుడు ఏ హీరో దగ్గర ఉందో తెలుసా?
