క్రైమ్ మిర్రర్, నల్లగొండ: ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న కంపచెట్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు నల్లగొండ 9వ డివిజన్ కార్పొరేటర్ బాణావత్ దీప్లా నాయక్. డివిజన్ పరిధిలో రోడ్లకు ఇరువైపులా ఉన్న కంప చెట్లను పారిశుద్ధ్య కార్మికులతో కలిసి జేసీబీ సాయంతో తొలగించారు. న్యూ చైతన్యపురి కాలనీ సహా పలు కాలనీల్లో ఈ కార్యక్రమం కొనసాగింది. రోడ్లకు ఇరువైపులా రాకపోకలు ఇబ్బంది కలిగించేలా ఉన్నకంపచెట్లను తీసివేయించారు. రాకపోకలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు.
పరిసరాలను పరిశుభ్రత అందరి బాధ్యత!
అటు కొద్ది రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో డివిజన్ పరిధిలోని మురుగు నీరు నిలిచే ప్రదేశాలను జేసీబీ సాయంతో శుభ్రం చేయించారు. మట్టిపోసి గుంతలు పూడ్చారు. ఈ సందర్భంగా.. మాట్లాడిన కార్పొరేటర్ దీప్లా నాయక్.. ప్రజలంతా పరిసరాల శుభ్రత పాటించాలని సూచించారు. చెత్తా చెదారాన్ని పరిసరాల్లో పారవేయకూడదన్నారు. ఇంటి పరిసరాల్లో చెత్త పేరుకుపోవడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు దోమలు పెరిగి, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, మలేరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. చెత్తను పడేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేసి శానిటేషన్ ఆటోవాలాలకు ఇవ్వాలన్నారు. అలా చేయండ వల్ల పరిసరాలు శుభ్రంగా ఉండటంతో పాటు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు.
కంపచెట్ల తొలగింపు కార్యక్రమంలో కార్పొరేటర్ దీప్లానాయక్ తో పాటు వజ్జ శ్రీనివాస్ యాదవ్, కునుకుంట్ల శంకర్, కన్నెబోయిన నగేష్, కన్నెబోయిన రమేష్, శాటినిటేషన్ జవాన్ పెరిక సైదులు, శానిటేషన్ వర్కర్ బొజ్జ యాదయ్య, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
Read Also: అనునిత్యం ప్రజల్లో ఉంటా.. ప్రజా సమస్యలను పరిష్కరిస్తా: దీప్లా నాయక్
