క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ :- ఐపీఎల్ సీజన్-19 లో భాగంగా నిన్న రాత్రి 7:30 గంటలకు కోల్కతా వేదికగా కోల్కతా మరియు లక్నో మధ్య హోరా హోరీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో లక్నో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఒకానొక దశలో లక్నో ఓడిపోతుంది అని ప్రతి ఒక్కరూ కూడా అనుకున్నారు. కానీ చివరిలో యంగ్ ప్లేయర్ ముకుల్ చౌదరి తన అద్భుతమైన ఇన్నింగ్స్ తో మ్యాచ్ ని ఒంటి చేత్తో గెలిపించాడు. చివరి 3 ఓవర్లలో కేకేఆర్ పై ఈ యువ క్రికెటర్ విధ్వంసాన్ని సృష్టించి చివరికి జట్టుకు మంచి విజయాన్ని అందించారు.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్!
ఇక మ్యాచ్ అనంతరం ముకుల్ మాట్లాడుతూ… ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ ను మహేంద్రసింగ్ ధోనీకి అంకితం చేస్తున్నాను అని ప్రకటించారు. మహేంద్ర సింగ్ ధోని నీ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను.. ధోని బ్యాటింగ్ ఆర్డర్ లోనే నేను వస్తాను. నా కెరియర్ ప్రారంభంలో మహేంద్ర సింగ్ ధోనీనే నాకు అతిపెద్ద ఇన్స్పిరేషన్ అని ఈ యంగ్ ప్లేయర్ ముకుల్ చౌదరి చెప్పుకొచ్చారు. అద్భుతమైన ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కించుకున్నారు. దీంతో ఈ ఐపీఎల్లో ఇంకా ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ రికార్డ్స్ సృష్టిస్తారా అని ఎంతో మంది ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
శబరిమలలో మహిళల ప్రవేశం పై ఆంక్షలు మతపరమైనవే…సమర్థించిన సుప్రీం కోర్టు…!
