
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ లో 144 సంవత్సరాలకు ఒక సారి వచ్చే కుంభ మేళాలో చేవెళ్ల నియోజకవర్గం, శంకర్ పల్లి మునిసిపల్ కాంగ్రెస్ నాయకులు రఘునందన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. పుణ్య స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. జనవరి 13న ప్రారంభం అయిన మహాకుంభమేళా ఫిబ్రవరి 26న ముగియనుంది. ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అయిన ఈ కుంభమేళాకు ఇప్పటి వరకు 53 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. సామాన్యులే కాకుండా దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు కూడా కుంభమేళాలో పుణ్య స్నానాలు చేశారు.
ఈ మహా కుంభమేళాలో ఇప్పటివరకు చాలామంది సెలబ్రిటీలతో పాటు చాలామంది రాజకీయనేతలు కూడా వచ్చారు. వీళ్ళు మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలల నుండి బిజినెస్ మాన్లు, నాగ సాధువులు ఇలా ఎంతోమంది.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 53 కోట్ల మంది భక్తులు వచ్చి ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న మహా కుంభమేళాలోని త్రివేణి సంఘంలో పుణ్యస్నాలను ఆచరించారు. ఇక రేపటితో ఈ మహా కుంభమేళా ముగియను ఉండడంతో ఇవాళ ఇంకా మరింత ముందు భక్తులు పోటెత్తేటువంటి అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి