ఆంధ్ర ప్రదేశ్

ఏపీ సచివాలయంలోని పవన్ కల్యాణ్ బ్లాక్ లో మంటలు

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని రెండవ బ్లాక్ వద్ద అగ్నిప్రమాదం జరిగింది. రెండో బ్లాక్ లో ఉన్న బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు SPF సిబ్బంది. దీంతో స్పాట్ కు చేరుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

సచివాలయంలోని రెండో బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రులు అనిత, పయ్యావుల కేశవ్‌, నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేష్‌, ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ పేషీలు ఉన్నాయి.ఘటన తెల్లవారుజామున జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కారణాల పై ఆరా తీస్తున్నారు భద్రతా అధికారులు.

ఇవి కూడా చదవండి ..

  1. పవన్‌ కళ్యాణ్‌పై కేసు – కోర్టు కీలక వ్యాఖ్యలు 

  2. అకడమిక్ క్యాలెండర్ విడుదల… సెలవులు దినాలు ఎప్పుడంటే?..

  3. హైదరాబాద్ కు రెడ్ అలెర్ట్.. మునిగిపోవడం ఖాయమా?

  4. సభలోనే తెలంగాణ మంత్రిని బూతులు తిట్టిన మహిళలు

  5. ప్రియునితో కలిసి.. కట్టుకున్న మొగున్నే కాటికి పంపిన భార్య..

Back to top button