Homeక్రైమ్పసిపాపపై తల్లి పైశాచికం.. వేడి అట్లకాడతో ప్రైవేట్ భాగాలపై వాతలు

పసిపాపపై తల్లి పైశాచికం.. వేడి అట్లకాడతో ప్రైవేట్ భాగాలపై వాతలు

అమ్మా అని పిలిపించుకొని మురిసిపోవాల్సిన తల్లి.. ఆ పసిపాప పాలిట కసాయిలా మారింది. కన్నతల్లి లేని లోటు తీర్చాల్సిన ఆమెనే.. నాలుగేళ్ల చిన్నారి జీవితాన్ని నరకంగా మార్చింది. నిద్రలో పరుపు తడిపిందన్న చిన్న కారణంతో అట్లకాడను వేడి చేసి చిన్నారి మర్మాంగాలపై వాతలు పెట్టిన అమానవీయ ఘటన కేరళ రాష్ట్రం పాలక్కాడ్ జిల్లా కంజీకోడ్ సమీపంలో వెలుగుచూసింది. ఈ దారుణం వెలుగులోకి రావడంతో యావత్ సమాజం ఒక్కసారిగా షాక్‌కు గురైంది.

గత వారం జరిగిన ఈ కిరాతకం బయటపడటానికి ఓ అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలి అప్రమత్తతే కారణమైంది. క్లాసులో ఆ చిన్నారి కూర్చోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతుండటాన్ని, ముఖంలో చెప్పలేనంత వేదన కనిపించడాన్ని ఆ ఉపాధ్యాయురాలు గమనించారు. అనుమానం వచ్చి చిన్నారిని దగ్గరకు తీసుకుని విచారించగా, హృదయాన్ని కలిచివేసే నిజం బయటపడింది. పాప ప్రైవేట్ భాగాలపై తీవ్ర కాలిన గాయాలు ఉండటాన్ని చూసి ఉపాధ్యాయురాలు చలించిపోయారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితురాలు బీహార్‌కు చెందిన మహిళగా గుర్తించారు. ఆమె నేపాల్‌కు చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకోగా, ఆ వ్యక్తికి మొదటి భార్య ద్వారా కలిగిన ఈ నాలుగేళ్ల చిన్నారిని తనతోపాటే ఉంచుకుంది. అయితే పాప నిద్రలో పరుపు తడిపిందని కోపంతో ఊగిపోయిన ఆమె.. వంటింట్లో ఉన్న స్టీల్ అట్లకాడను స్టవ్‌పై వేడి చేసి చిన్నారి మర్మాంగాలపై వాతలు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితురాలిపై భారతీయ న్యాయ సంహితతో పాటు జువనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు గురువారం ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

ప్రస్తుతం తీవ్ర గాయాల పాలైన చిన్నారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తమ సంరక్షణలోకి తీసుకుంది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై చిన్నారి తండ్రి పాత్రపై కూడా పోలీసులు దృష్టి సారించారు. హోటల్‌లో పని చేసే తండ్రికి ఈ విషయం తెలుసా, లేక భార్య చర్యలను సమర్థించాడా అన్న కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.

ALSO READ: Warning: ఆ సిరప్ వాడకాన్ని వెంటనే ఆపేయండి..

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు