తెలంగాణ

నీ అయ్య,చెల్లె, బావకు టెస్టులు చేయించు.. కేటీఆర్ కు సవాల్

ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నోటీసు ఇవ్వగానే కేటీఆర్ హడలిపోతున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు.
విచారణకు వెళ్తానని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే బడాయి కబుర్లు చెపుతున్నాడని అన్నారు. తమరు ఏసీబీ విచారణకు హాజరై వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెపితే సరిపోతుందని కేటీఆర్ హితవు పలికారు ఆది శ్రీనివాస్.  సత్య హరిశ్చంద్రుడి లా కేటీఆర్ మాట్లాడుతున్నాడు.. మా ముఖ్యమంత్రి కి  నార్కో ఎనాలసిస్ టెస్ట్ చేయాలంటు సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు.. నార్కో ఎనాలసిస్ టెస్ట్ చేయాలా..? పాలిగ్రాఫ్ చేయాలా అన్నది కోర్టులు, విచారణ సంస్థలు నిర్ణయిస్తాయని ఆది శ్రీనివాస్ తెలిపారు.

ఎవరి మీద కేసు ఉంటే వాళ్లు విచారణ కు హాజరవుతారు తప్ప ఇంకొకరు వచ్చి నార్కో ఎనాలసిస్ టెస్ట్ లు చేసుకోరని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి అంత ధైర్యం ఉంటే ముందు మీ అయ్య, మీ చెల్లెలు, మీ బావతో నార్కో టెస్ట్ లు చేయించు.. కాళేశ్వరంలో మీ కక్కుర్తి పైన  మీ అయ్య కు, మీ బావ కు నార్కో ఎనాలసిస్ టెస్ట్ చేయిద్దాం.. లిక్కర్ స్కాంలో  మీ చెల్లెలు కి నార్కో చేయిద్దాం.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నీకు కూడా టెస్ట్ చేయాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆది శ్రీనివాస్.

ఛాలెంజ్ లు విసిరి పారిపోయిన చరిత్ర కేటీఆర్ ది.. గతంలో డ్రగ్స్  వ్యతిరేక పోరాటంలో   వైట్ ఛాలెంజ్ కు రావాలని మా రేవంత్ రెడ్డి పిలిస్తే రాకుండా పారిపోయిన చరిత్ర కేటీఆర్ ది.. సంక్షేమం, అభివృద్ధి తో మా ప్రభుత్వం ముందుకు పోతుంటే కేటీఆర్ పిచ్చి ప్రేలాపనలు, రోత మాటలు మాట్లాడుతున్నాడు.. కేటీఆర్ మాటలు ఆపకపోతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహించరు.. కేటీఆర్ .. నీ అతి తెలివి ప్రదర్శన ఆపి ఏసీబీ అధికారుల ముందుకు వచ్చి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు.. రాజకీయ కక్ష సాధింపులు, వేధింపులకు మా ముఖ్యమంత్రి పాల్పడితే ఇప్పటికే కేటీఆర్ జైలుకు వెళ్లే వారు..తమరికి జైలుకు వెళ్లాలన్న ఉబలాటం అంతగా ఉంటే మీ కోరిక ను  దర్యాప్తు సంస్థలు తీర్చుతాయి.. తొందర పడకండి..చట్టం ముందు అందరూ సమానమే.. కేటీఆర్ నీ బడాయి మాటలు ఆపి దర్యాప్తు సంస్థలకు సహకరించు అని ఆది శ్రీనివాస్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button