తెలంగాణ

ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా మిన్నుభాయ్

క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్:- జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎస్.కె నజీరుద్దీన్ (నిన్ను భాయ్) నీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షుడిగా మీర్జా మోబిన్ బేగ్, ప్రధాన కార్యదర్శిగా తూటి చర్ల దుర్గయ్య, కోశాధికారిగా ఐతరాజిరెడ్డి, సంయుక్త కార్యదర్శిగా చీరలవంచ రమేష్ చారి, ప్రెస్ క్లబ్ బాధ్యులుగా రేగుల భాస్కర్ ను ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మినుభాయ్ మాట్లాడుతూ…. నా ఎన్నికకు సహకరించిన తోటి జర్నలిస్టు మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తానని, జర్నలిస్టులకు సంబంధించిన అక్రిడేషన్ కార్డు సమస్యలు, ఇంటి స్థలాల సమస్యల ను పరిష్కరించే దిశగా పనిచేస్తానని, జర్నలిస్టు మిత్రులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

పడిపోతున్న టీడీపీ ఎమ్మెల్యేల గ్రాఫ్‌ – పెరుగుతున్న జగన్‌ ఇమేజ్‌ – ముందస్తు సర్వేలు ఏం చెప్తున్నాయంటే..!

భార్యపై అనుమానం.. ఉరేసి చంపిన భర్త… సరూర్ నగర్ లో దారుణ ఘటన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button