క్రైమ్

హనీమూన్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్, యువతి హత్యకు ప్లాన్!

Honeymoon Murder Case: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో షాకింగ్ విషయం బయటపడింది. రాజా రఘువంశీతో పాటు మరో యువతి హత్యకు నిందితులు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. జంట హత్యలు చేసి కేసు పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఇంతకీ వీళ్లు హత్య చేయాలనుకున్న మరో యువతి ఎవరు? ఎందుకు చంపాలి అనుకున్నారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మరో యువతి హత్యకు నిందితల ప్లాన్!

అటు ఈ కేసులో మరో షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. రఘువంశీని అన్యాయంగా చంపేసిన సోనమ్ బ్యాచ్.. మరో యువతిని చంపి, డెడ్ బాడీని కాల్చివేయాలని ప్లాన్ చేశారు. ఆ డెడ్ బాడీ సోనమ్ దిగా చిత్రీకరించాలని ప్రయత్నించారు. రాజాతో పాటు సోనమ్ ను దోపిడీ దొంగలు హత్య చేసినట్లు సీన్ క్రియేట్ చేయాలనుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే, సోనమ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న నేపథ్యంలో ఈ ప్లాన్ వర్కౌట్ కాలేదని పోలీసులు వెల్లడించారు. అప్పటికే, సోనమ్ పోలీసులకు చిక్కడంతో మరో యువతి ప్రాణాలు పోలేదన్నారు. ప్రస్తుతం రాజా రఘువంశీ హత్యలో పాల్గొన్నఅందరినీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అందరూ పోలీసులు కస్టడీలో ఉన్నారు.

హత్య తర్వాత అద్దెగదిలో ఫోటోలు

పెళ్లి అయిన 9 రోజులకే హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకెళ్లి ప్లాన్ ప్రకారం తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి భర్త రాజా రఘువంశీని హత్య చేయించింది సోనమ్. పెళ్లికి ముందు నుంచి ప్రేమలో ఉన్న సోనమ్, రాజ్ కుష్వాహ ఎలాగైనా రఘువంశీని హత్య చేయాలని ప్లాన్ చేశారు. హత్య తర్వాత వీరిద్దరు కలిసి ఓ ఫోటో దిగారు. అందులో వీరిద్దరు ఎంతో హ్యాపీగా కనిపిస్తున్నారు. ఈ ఫోటో ఇండోర్ లోని విజయ్ నగర్ లో దిగినట్లు పోలీసులు గుర్తించారు. హత్య తర్వాత కూడా ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నారు? అంటూ పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: ఇన్ స్టాగ్రామ్ లో వేధింపులు.. నటి కల్పికపై మరో కేసు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button