
క్రైమ్ మిర్రర్, చండూరు :-
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత సైన్యం వీరవిహారం చేసి పాకిస్తాన్ ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేయడంలో విజయాన్ని హర్షిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన తిరంగా యాత్ర ర్యాలీ ని విజయవంతం చేయాలని బీజేపీ పార్టీ చండూరు పట్టణ అధ్యక్షుడు పందుల సత్యం గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 30న శుక్రవారం సాయంత్రం 3గంటలకు చండూరు మున్సిపల్ కేంద్రంలోని హైస్కూల్ మైదానం నుండి ర్యాలీ ప్రారంభం అవుతుందని, పార్టీలకు అతీతంగా యువజన సంఘాలు, జాతీయ వాదులు ఈ ర్యాలీలో పాల్గొనాలని కోరారు. ఈ ర్యాలీ కి ముఖ్య అతిథిలుగా బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, జిల్లా పార్టీ అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ లు పాల్గొంటారని ఆయన తెలిపారు. జాతీయ జెండాలతో పట్టణ ప్రధాన వీధుల గుండా సాగే ఈ ర్యాలీ మెయిన్ సెంటర్ లో ముగుస్తుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు కోమటి వీరేశం, జిల్లా నాయకులు సముద్రాల వెంకన్న, భూతరాజు శ్రీహరి, బోడ ఆంజనేయులు, అన్నెపర్తి యాదగిరి, ఇరిగి ఆంజనేయులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ శంకర్, భూతరాజు స్వామి, ఉపాధ్యక్షులు చెనగాని శేఖర్, అధికార ప్రతినిధి కారింగు విజయ్, వీరమళ్ళ రాంశెట్టి, బూత్ అధ్యక్షులు సామ వెంకట్ రెడ్డి, తోకల రవీందర్, చెరిపల్లి కృష్ణ, పున్న అరుణోదయ, బోయపల్లి కిరణ్, గన్నవరం నాగరాజు, కార్యవర్గ సభ్యులు కారింగు రాజు, తదితరులు పాల్గొన్నారు.
ఆత్మరక్షణ కోసం తైక్వాండో దోహదపడుతుంది..- ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు