Tuesday, February 24, 2026
Homeతెలంగాణమంబాపూర్ పేపర్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

మంబాపూర్ పేపర్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

క్రైమ్ మిర్రర్, పటాన్ చెరు ప్రతినిధి : –
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజక వర్గం గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామంలోని తిరుమల ఆయిల్చెం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (పేపర్ డివిజన్) పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పరిశ్రమలోని పేపర్ మెటీరియల్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మూడుగంటల పాటు మంటలు ఎగిసిపడ్డాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సహాయంతో నీటి ట్యాంకర్ల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు లేకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పరిశ్రమ భద్రతాపరమైన ప్రమాణాలు పాటించలేదనే ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తయి వివరాలు తెలియాల్సి ఉంది.

రేవంత్ అమ్మిన భూమిని కొనవద్దు.. మేం తిరిగి లాగేసుకుంటం

ఆ భూములు నీ అయ్య జాగీరా.. సీఎం రేవంత్ పై రెచ్చిపోయిన జేజమ్మ

ఎల్బీనగర్ వాసులకు రెడ్ అలెర్ట్.. చికెన్ తింటే మటాష్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments