Monday, February 23, 2026
HomeజాతీయంMadras High Court: జస్టిస్‌ స్వామినాథన్‌ను విమర్శిస్తూ పుస్తకమా? మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం!

Madras High Court: జస్టిస్‌ స్వామినాథన్‌ను విమర్శిస్తూ పుస్తకమా? మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం!

తమిళనాడులోని  తిరుప్పరంకుండ్రంపై కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ తీర్పునిచ్చిన మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌ ను విమర్శిస్తూ పుస్తకం ప్రచురించడంపై మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.   చెన్నైలో ప్రారంభం కానున్న పుస్తక ప్రదర్శనలో ఆ పుస్తకాన్ని పెట్టరాదని ఆదేశించింది. అంతేకాకుండా న్యాయమూర్తిపై విమర్శలు గుప్పిస్తూ ప్రచురించిన పుస్తకాన్ని తక్షణం స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ పుస్తక ప్రచురణ సంస్థపై సుమోటోగా కేసు నమోదు చేసి, విచారణకు ఆదేశించింది.

న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు!

వేలూరుకు చెందిన నవీన్‌ ప్రసాద్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌లో జస్టిస్‌ స్వామినాథన్‌పై వ్యక్తిగత దూషణలు, విమర్శలతో ముద్రించిన పుస్తకాన్ని బుక్‌ ఎగ్జిబిషన్‌లో విక్రయిస్తే అది న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకున్నట్లవుతుందని, కాబట్టి ఆ పుస్తకం అమ్మకాలపై నిషేధం విధించాలని కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎం శ్రీవాత్సవ, జస్టిస్‌ జి.అరుళ్‌మురుగన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపి ఆదేశాలు ఇచ్చింది.

కార్తీకదీపం వెలిగించుకునేందుకు హైకోర్టు అనుమతి

తమిళనాడులోని తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలోతాజాగా మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తిరుపరంకుండ్రం కొండపై దీపం వెలిగించేందుకు హిందువులకు అనుమతి ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌ సమర్థించింది. స్టాలిన్ ప్రభుత్వ వైఖరిని న్యాయమూర్తులు తప్పుబట్టారు. సింగిల్ బెంచ్ తీర్పును అమలు చేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లర్లు జరుగుతాయనే కారణం చూపి కొండపై కార్తీక దీపం వెలిగించకుండా ఆపడం సరికాదని జస్టిస్ జీ జయచంద్రన్, జస్టిస్ కేకే రామకృష్ణన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మండిపడింది. కార్తీక దీపం వెలిగించే సమయంలో భక్తులకు పరిమితంగానే అనుమతి ఉంటుందని న్యాయమూర్తులు వెల్లడించారు. అది కూడా పురావస్తు శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వారు తెలిపారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments