
ఎమ్మెల్సీ కవిత తాజా రాజకీయ అడుగులపై కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. కవిత బీజేపీ వదిలిన బాణం అన్నారు. లిక్కర్ కేసులో 6 నెలలు జైలుకు వెళ్లొచ్చిందన్నారు. బతుకమ్మ పేరుతో బ్రతుక నేర్చిందన్నారు. కవితని తీసుకునేంత దరిద్రం కాంగ్రెస్ పార్టీకి పట్టలేదంటూ తీవ్ర విమర్శలు చేశారు మధుయాష్కీ గౌడ్.
మద్యం వల్ల ఆడబిడ్డల తాళి తెగిపాడుతుంటే… రాష్ట్రం లో సరిపోలేదని ఢిల్లీలో తాగుడు దుకాణం పెట్టి స్కాం చేసిందని మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లలో జిస్టీ స్కాం లు ఉన్నాయని..కవిత అవినీతి కప్పిపుచ్చుకోడానికే ఇదంతా చేస్తుందన్నారు.జాగృతి పేరుతో 800 కోట్ల కుంభకోణం జరిగిందని.. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ట్రైనింగ్ ఇవ్వకుండా డబ్బులు దోచేసారని ఆరోపించారు. జాగృతి సంస్థ పక్క అవినీతి సంస్థ అని మధుయాష్కీ స్పష్టం చేశారు.
జాతిపిత అని కేసీఆర్ని ఎత్తుకుంటే పిశాచిలాగా మరి 10 ఏళ్లు దోచుకున్నాడని కవిత విమర్శించారు. కవితకి కేసీఆర్ జాతి పిత ఏమో కానీ రాష్ట్రానికి కేసీఆర్ పిశాచి అన్నారు. కవిత చిన్న లేడీ మాఫియా డాన్ అన్నారు. కవిత చేయని వ్యాపారాలు లేవు, చేయని స్కాం లేదన్నారు.బ్యూటీ పార్లర్ నడుపుతున్న కవితకి కోట్లు విలువ చేసి బిల్డింగ్స్ బంజారాహిల్స్ లో ఎలా వచ్చాయని ప్రశ్నించారు.బీజేపీ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం…రాష్ట్రం లో బీఆర్ఎస్ వీక్ ఐతే బీజేపీ బలపడుతుంది అనే కోణంలో లెటర్ ఇచ్చిందన్నారు.
కవిత ఎంపీగా ఉన్నపుడు మోడీతో సెల్ఫీ లు దిగింది..బీజేపీ రచించిన వ్యూహరచన లో భాగంగానే కవిత ఇలా మాట్లాడుతుందని మధుయాష్కీ గౌడ్ చెప్పారు. జాగృతి పేరుతో దోచుకున్న సొమ్ము ని దాచుకోవడానికే జాగృతి బలోపేతం చేస్తా అంటున్నారని అన్నారు.చెట్ల పేరుతో సంతోష కోట్ల స్కాం చేసిండని.. ఇప్పుడు ఎందుకో చెట్లు నాటడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకపోతే మొజాంజా మార్కెట్ లో పూలు అమ్ముకున్నే వారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్నారు.కవిత తెలంగాణతో పాటు ఏపీ లో బ్యూటీ పార్లర్ పెట్టుకునేదని మధుయాష్కీ విమర్శించారు.