Wednesday, March 18, 2026
Homeతెలంగాణఎయిర్ పోర్టులో మంత్రుల రుసరుసలు, అలిగిపోయిన కోమటిరెడ్డి!

ఎయిర్ పోర్టులో మంత్రుల రుసరుసలు, అలిగిపోయిన కోమటిరెడ్డి!

Komatireddy Venkat Reddy Angry: హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టుల్లో నల్లగొండ మంత్రుల మధ్య టైమ్ వార్ నడించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేసి, అలిగి వెళ్లిపోయారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

నాగార్జునసాగర్ డ్యామ్ నిండటంతో గేట్లు ఎత్తడానికి హెలికాప్టర్ ద్వారా  సాగర్ కు రావాలని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నిర్ణయించారు. షెడ్యూల్ ప్రకారం 9 గంటలకు హెలికాప్టర్ బయల్దేరాల్సి ఉంది. అనుకున్నట్లుగానే సరిగ్గా 9 గంటలకు కోమటిరెడ్డి, అడ్లూరి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కానీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమయానికి రాలేదు. గంట వెయిట్ చేసిన ఆయన రాకపోవడంతో కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తమను ఉదయం 9 గంటలకే ఎయిర్ పోర్ట్ కు రావాలని చెప్పిన ఉత్తమ్.. ఆయన 10 గంటలు అయినా రాకపోవడం ఏంటని మండిపడ్డారు. ఉత్తమ్ ఆలస్యంపై అలకబూనాడు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి వెళ్లిపోయారు. కోమటిరెడ్డికి ఉత్తమ్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా, వినకుండా వెళ్లిపోయారట. చివరకు కోమటిరెడ్డి లేకుండానే హెలికాప్టర్ లో మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్ నాగార్జున సాగర్ కు బయల్దేరారు. నాగార్జునసాగర్ పూర్తి స్థాయిలో నిండటంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్.

Read Also: నిండు కుండలా నాగార్జున సాగర్‌.. 2 గేట్లు ఎత్తనున్న అధికారులు!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments