
India vs England Test: యంగ్ ప్లేయర్ శుభమన్ గిల్ కెప్టెన్ గా ఇంగ్లాండ్ తో లీడ్స్ లో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓడిపోయింది. తొలుత మ్యాచ్ మీద పట్టు బిగించినట్లు అనిపించినా, చివరికి వచ్చే సరికి భారత్ విఫలం కావడంతో మొదటి టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించింది. తొలి టెస్టు ఓడినా, రెండు టెస్టు మీద మంచి ఫోకస్ పెట్టాలని టీమిండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరో గట్టి ఎదురు దెబ్బ తగిలేలా అనిపిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
రెండో టెస్టుకు బుమ్రా దూరం?
తొలి టెస్టు ఓడిపోయినా, రెండో టెస్టులో విజయం సాధించాని భావిస్తున్న టీమిండియాకు ఇబ్బందులు తప్పడం లేదు. జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న పేసర్ జస్ ప్రీత్ బుమ్రా బర్మింగ్ హామ్ టెస్టులో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. తొలి టెస్టులో మిగతా పేసర్లు సక్సెస్ కాలేకపోయినా, బుమ్రా చక్కగా రాణించాడు. అయితే, అతడికి రెండో టెస్టులో విశ్రాంతి ఇవ్వాలని జట్టు మేనేజ్ మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రెండో టెస్టుకు అతడు దాదాపు దూరం అయినట్లే అనే టాక్ వినిపిస్తోంది.
మూడో టెస్టుకు అందుబాటులో!
రెండో టెస్టుకు దూరం అయినప్పటికీ లార్డ్స్లో జరిగే మూడో టెస్ట్ కు బుమ్రా అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. లీడ్స్ టెస్టులో ఓటమి నుంచి పుంజుకోవాల్సిన అవసరం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బుమ్రాకు విశ్రాంతి ఇస్తే, భారత్ 0-2తో వెనుకబడే అవకాశం ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి వెల్లడించాడు. ఈ సిరీస్ లో మూడు టెస్టులు ఆడుతానని బుమ్రా చెప్పినప్పటికీ, అవి ఏవి అనేది చెప్పలేదన్నాడు. ఒకవేళ రెండో టెస్టుకు దూరం అయితే, భారత్ కు సిరీస్ గెలిచే విషయంలో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందన్నాడు. టీమిండియా పోటీలో ఉండాలంటే కచ్చితంగా రెండో టెస్టులో బుమ్రా ఆడాల్సిన అవసరం ఉందన్నాడు.
Read Also: ఫస్ట్ టెస్టులో ఓటమి.. గంభీర్ ఏమన్నాడంటే?