Friday, March 13, 2026
Homeఆంధ్ర ప్రదేశ్రూల్స్ అతిక్రమించిన జనసేన నేత!... పార్టీ నుండి తోలిగింపు?

రూల్స్ అతిక్రమించిన జనసేన నేత!… పార్టీ నుండి తోలిగింపు?

పార్టీ గీత దాటిన ఓ నేతపై జనసేన హైకమాండ్ చర్యలు తీసుకుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు వద్ద కోడిపందాలు నిర్వహించారు. అయితే, ఈ కోడిపందాల బరి వద్ద పెనమలూరు నియోజకవర్గ జనసేన నేత ముప్పా గోపాలకృష్ణ (రాజా) పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీన్ని పార్టీ నాయకత్వం తీవ్రంగా పరిగణించింది.

ఆఫ్ లైన్ పద్ధతి లోనే నీట్ యూజి 2025 పరీక్షలు

ముప్పా గోపాలకృష్ణను క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేస్తున్నట్టు నేడు ఓ ప్రకటన విడుదల చేసింది. కోడి పందాల బరుల వద్ద ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు ఏర్పాటు చేయడం జనసేన పార్టీ విధానాలకు, ప్రతిష్ఠకు భంగకరం. ఇందుకు బాధ్యులైన మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

పోరాడకుండానే తెలివిగా గెలిచిన కోడి!…

ఇకపై జనసేన పార్టీ కార్యక్రమాలతో మీకు ఎటువంటి అధికారిక సంబంధం లేదు అని ముప్పా గోపాలకృష్ణకు స్పష్టం చేశారు. ముప్పా గోపాలకృష్ణ పెనమలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా వ్యవహరిస్తున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments