తెలంగాణ

కరెంట్ పోతే డాక్టర్లు ఏం చేస్తరు రేవంత్.. డాక్టర్ల సంఘం సీరియస్

తెలంగాణ ప్రభుత్వ తీరుపై తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ అసహనం వ్యక్తం చేసింది. రేవంత్ సర్కార్ తీరుపై ఘాటు లేఖ రాసింది. హాస్పిటల్స్ లో సరైన వసతులు కల్పించకుండా.. తమ జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది.

తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైద్యులను బలి చేసింది రేవంత్ సర్కార్. ఇటీవల జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సెల్ ఫోన్ వెలుగుల్లో రోగులకు వైద్యం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, ఆ ఘటనకు వైద్యులను బాధ్యులుగా చేస్తూ వారిని సస్పెండ్ చేసిన ప్రభుత్వం. దీంతో ఆసుపత్రిలో కరెంటు పోతే వైద్యులను సస్పెండ్ చేయడం ఏంటని..జనరేటర్లు పనిచేయకపోతే సెల్ ఫోన్ వెలుగులో వైద్యం చేయడం డాక్టర్ల తప్పు ఎలా అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

విద్యుత్ సరఫరా నిలిచిపోయి జనరేటర్లు కూడా పనిచేయకపోవడంతో సెల్ ఫోన్ లైట్ల వెలుగుల్లో వైద్యం చేయాల్సి వచ్చిందని దానికి వైద్యులను సస్పెండ్ చేయడం ఏంటని ప్రభుత్వాన్ని నిలదీసింది తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ).ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను కలించడంలో విఫలమైన ఆరోగ్యశాఖ, తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి వైద్యులను సస్పెండ్ చేయడం సమంజసం కాదని డాక్టర్ల సంఘం తేల్చి చెప్పింది. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల పట్ల ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన తెలంగాణ డాక్టర్ల సంఘం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button