అంతర్జాతీయం

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. భగ్గుమంటున్న పశ్చిమాసియా!

Israel-Iran Conflict: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతోంది. ఫలితంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇజ్రాయెల్ కు మద్దతుగా బ్రిటన్ తన సైన్యాన్ని రంగంలోకి దింపుతోంది. ఇరాన్ లోని తమ ఆర్మీ బేస్ లు మీద దాడులు చేస్తే, ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. అటు ఇరాన కు తుర్కియే మద్దతిస్తుంది. ఇరాన్- ఇజ్రాయెల్ కు పలు దేశాలు సపోర్టు చేయంతో ఉద్రిత్తతలు పెరుగుతున్నాయి.

ఇజ్రాయెల్ వరుస దాడులు

తొలి రోజు ఇరాన్ క్షిపణి కేంద్రాలు, అణు స్థావరాలు, మిలటరీ అధికారులే లక్ష్యంగా మిసైల్స్, డ్రోన్ దాడులు చేయడగా, తాజాగా గ్యాస్ క్షేత్రాలు, ఆయిల్ శుద్ధి కర్మాగారాల మీద బాంబు దాడులు చేసింది. ఈ చమురుకు క్షేత్రాలు సైన్యం కోసం పని చేస్తున్నందునే దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. టెహ్రాన్‌ లోని రక్షణశాఖ కార్యాలయాన్ని కూల్చివేసినట్లు వెల్లడించింది. ఈ దాడిలో పలువురు ఇంటెలిజెన్స్ అధికారులు చనిపోయినట్లు వెల్లడించింది. ఇప్పట్లో ఇరాన్ అణుశుద్ధి కార్యక్రమాలను జరపలేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు మొస్సాద్‌ ఇరాన్‌ పలు కారు బాంబులు పేల్చింది. ఈ ఘటనల్లో ఆరుగురు ఇరాన్ అణుశాస్త్రవేత్తలు చనిపోయినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. ఇప్పటి వరకు మొత్తం 14 మంది అణు శాస్త్రవేత్తలు చనిపోయినట్లు తెలిపింది. మూడు రోజుల్లో ఇరాన్‌ లో 406 మంది చనిపోగా,  654 మంది గాయపడ్డారు.

ఇజ్రాయెల్‌ లో 10 మంది మృతి

మరోవైపు ఇరాన్ ప్రతిదాడుల్లో ఇజ్రాయెల్ కు చెందిన 10 మంది మృతి చెందారు. ఇరాన్‌ తొలిసారి హజ్‌ ఖాసీం అనే బాలిస్టిక్‌ మిసైల్‌ ను ప్రయోగించింది. దీని కారణంగా టెల్‌ అవీవ్‌ లోని పట్టణాలు ధ్వంసం అయ్యాయి. ఒక్కరోజే నలుగురు చిన్నారులతో పాటు 10 మంది చనిపోయారు

ట్రంప్ హెచ్చరిక.. ఇరాన్ స్పందన!

అటు ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడులు చేయడంతో ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదే సీన్ మళ్లీ రిపీట్ అయితే, టెహ్రాన్ రూపురేఖలు కోల్పోవాల్సి ఉంటుందన్నాడు. అటు ఇజ్రాయెల్‌ దాడులు ఆపితే, తామూ ఆపుతామని ఇరాన్‌ ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్‌ విదేశాంగ శాఖ అధికారి అబ్బాస్‌ అరాగ్చి కీలక ప్రకటన చేశారు.

Read Also: ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. ఇరాన్ లో పెను విధ్వంసం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button