
Israel-Iran Conflict: ఇజ్రాయెల్ భీకర దాడులతో ఇరాన్ అతలాకుతలం అవుతోంది. మూడు రోజులుగా ఇజ్రాయెల్ వరుస దాడులకు పాల్పడుతోంది. ఇరాన్ క్షిపణి కేంద్రాలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. బుషెహర్ చమురు క్షేత్రాలతో పాటు సౌత్ పార్స్ నేచురల్ గ్యాస్ ప్రాంతాలపై బాంబు దాడులు చేసింది. ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇంటికి సమీపంలోనూ ఇజ్రాయెల్ క్షిపణులు పడ్డట్లు వెల్లడించారు.
బెంజిమిన్ కీలక ప్రకటన
అటు ఇరాన్ మొత్తం తమ టార్గెట్లో ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో 9 మంది కీలక శాస్త్రవేత్తలు చనిపోయినట్లు తెలిపారు. మరో 16 మంది మిలటరీ జనరల్స్ ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. చనిపోయిన వారిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ముఖ్య సలహాదారు షంఖానీ, చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ ఇరానియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మహమ్మద్ బఘేరీ, ఎమర్జెన్సీ రెస్పాన్స్ చీఫ్ గులామ్ అలీ రషీద్, ఇంటెలిజెన్స్ చీఫ్ గులామ్ అల్ మర్హాబ్, ఇస్లామిక్ రివొల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ హుస్సేన్ సలామీ, ఐఆర్జీసీ ఎయిర్ కమాండర్ ఆమిర్ అలీ హాజీజాదే,డ్రోన్స్ డిపార్ట్ మెంట్ కమాండర్ తాహెర్ పుర్, ఎయిర్ డిఫెన్స్ కమాండర్ దావూద్ షిహ్యాన్, మిసైల్స్ డిపార్ట్ మెంట్ కమాండర్ మహమ్మద్ బఘేరీ చనిపోయినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో 78 మంది మృతి చెందడంతో పాటు 320 మంది గాయపడ్డారని ఇరాన్ మీడియా వెల్లడించింది. అటు ఇరాన్ జరిపిన బాలిస్టిక్ క్షిపణి దాడుల్లో ముగ్గురు చనిపోగా, 80 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది.
రష్యాకు పారిపోతున్న ఇరాన్ ప్రముఖులు
అటు ఇజ్రాయెల్ వరుస దాడులతో ఇరాన్ ప్రముఖులు రష్యాకు పారిపోతున్నట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా వెల్లడించింది. సుప్రీం లీడర్ ఖమేనీ ఇంటి సమీపంలోనూ క్షిపణి దాడులు జరగడంతో ఆయన ముఖ్య సలహాదారు, ఆర్మీ అధికారులు చనిపపోయారు. మిగతా కీలక అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ప్రైవేట్ జెట్లు పెద్ద సంఖ్యలో రష్యాకు చేరుకుంటున్నట్లు ఇజ్రాయెల్ వార్తాసంస్థలు వెల్లడించాయి.
Read Also: ఇరాన్ తో యుద్ధం.. భారత్ కు క్షమాపణలు చెప్పిన ఇజ్రాయెల్!