
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని క్రికెట్ అభిమానులకు ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే అంతర్జాతీయ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ లో జరగబోతుంది. ఉమెన్స్ ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్లకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఈ విషయాన్ని స్వయానా మంత్రి నారా లోకేష్ తన అధికారిక ఎక్స్ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. తెలుగు క్రికెట్ అభిమానులు ఎక్కువగా తెలంగాణకు వెళ్లి మ్యాచ్లను చూడాల్సి వస్తుంది. నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ లో క్రికెట్ స్టేడియం ఉందని కూడా ఎవరికి తెలియకపోవచ్చు. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ లో ని క్రికెట్ స్టేడియం వైపు మెడలు తిప్పుతున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి కొన్ని ఐపీఎల్ మ్యాచ్లు కూడా వైజాగ్ లోని వైయస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో జరిగాయి.
ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ మ్యాచ్ లు జరుగుతుండడం ప్రతి ఒక్కరిని కూడా ఆనందంతో ముంచెత్తుతుంది. వైజాగ్ లోని ఏసీఏ – వీడిసిఎ క్రికెట్ స్టేడియంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన మహిళా క్రికెటర్లకు ఏపీ ఆదిత్యం ఇవ్వబోతుంది. ప్రతి ఒక్కరు కూడా మన వైజాగ్ క్రికెట్ స్టేడియంలో కూడా ఇంటర్నేషనల్ మ్యాచులు జరుగుతే చాలా బాగుంటుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వేలా… ఇలా ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ రూపంలో క్రికెట్ లవర్స్ కి సరికొత్త సర్ప్రైజ్ ఇచ్చారు. వైజాగ్ లో జరగబోయే ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ షెడ్యూల్ నిన్న విడుదల చేశారు. ఇందులో భాగంగానే అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 16 తేదీ వరకు వైజాగ్ లో మ్యాచులు జరగనున్నాయి. అక్టోబర్ 9న భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ జరుగునుంది. అక్టోబర్ 10న న్యూజిలాండ్ మరియు బంగ్లాదేశ్, అక్టోబర్ 12న భారత్ మరియు ఆస్ట్రేలియా, అక్టోబర్ 13న సౌత్ ఆఫ్రికా మరియు బంగ్లాదేశ్, ఇక చివరిగా అక్టోబర్ 16న ఆస్ట్రేలియా మరియు బంగ్లాదేశ్ మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ లు వైజాగ్ లోనే జరగనున్నాయి. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్క ఆంధ్ర క్రికెట్ అభిమాని ఫుల్ జోష్ లో ఉన్నారు. కాబట్టి వైజాగ్ లో ఈ మ్యాచ్ లు చూడడానికి టికెట్లు కొనుగోలు చేయండి.
మరో 4 రోజులు వర్షాలు.. వాతావరణశాఖ ఇంకా ఏం చెప్పిందంటే?
జగన్ సరికొత్త నిర్ణయం… కొత్త వ్యూహకర్తతో రంగంలోకి దిగనున్న వైసిపి!.