క్రీడలు

ఇకపై 4 రోజులే టెస్ట్ మ్యాచ్.. ఐసీసీ కీలక నిర్ణయం!

Four Days Test: టెస్ట్ క్రికెట్ విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. వ‌ర‌ల్డ్ టెస్టు చాంపియ‌న్‌ షిప్ కొత్త సైకిల్ మొదలైన కొత్త నిబంధనను అందుబాటులోకి తీసుకురాబోతోంది. 2027-29 సిరీస్ లోనే ఈ రూల్ ను అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న దేశాల‌కు టెస్టు మ్యాచ్‌ ల‌ను నాలుగు రోజులే నిర్వ‌హించాలని ఐసీసీ ఆలోచిస్తోంది. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జ‌ట్ల‌కు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. లార్డ్స్‌ లో  రీసెంట్ గా డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ జరిగింది. ఈ సమయంలో ఐసీసీ చైర్మెన్ జై షా దీనిపై చ‌ర్చించిన‌ట్లు సమచారం. 4 రోజుల టెస్టు మ్యాచ్‌ ల‌కు ఆయన కూడా సపోర్టు చేసినట్లు తెలుస్తోంది. 2027-29 సైకిల్‌ కు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

2017లోనే నాలుగు రోజుల టెస్టులకు ఐసీసీ అనుమతి

2017లోనే నాలుగు రోజుల టెస్టుకు ఐసీసీ అనుమ‌తి ఇచ్చింది. గ‌త నెల‌లో ఇంగ్లండ్‌, జింబాబ్వే మ‌ధ్య 4 రోజుల టెస్టు జ‌రిగింది. ఐర్లాండ్‌తోనూ 2019, 2023లో  నాలుగు రోజుల టెస్టులు ఇంగ్లండ్ ఆడింది. సంప్ర‌దాయ‌క‌ర‌మైన 5 రోజుల టెస్టును నిర్వ‌హించేందుకు చాలా దేశాలు ఆసక్తి చూపించడం లేదు. అయితే 4 రోజుల టెస్టుల‌ను నిర్వ‌హించడం వ‌ల్ల‌.. మూడు టెస్టుల సిరీస్‌ను కేవ‌లం మూడు వారాల్లోనే పూర్తి చేయ‌వ‌చ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 4 రోజుల మ్యాచ్‌ లలో ఓవ‌ర్ల‌ను 98కి పెంచాల‌ని ఐసీసీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

2025-27 టెస్ట్ చాంపియ‌న్‌ షిప్‌  4 రోజుల ఫార్మాట్ లోనే! 

శ్రీలంక‌, బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌ తో ఈ కొత్త టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రారంభం అవుతోంది. 2025-27 సైకిల్‌లో మొత్తం 27 టెస్టు మ్యాచ్ సిరీస్‌లు ఉంటాయి. దీంట్లో 17 సిరీస్‌ లు రెండు మ్యాచ్‌ లు ఉంటాయి. మ‌రో  6 సిరీస్‌ లలో మూడు మ్యాచ్‌లు ఉంటాయి. ఇండియా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మాత్రం అన్ని 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లు జ‌రుగుతాయ‌ని తెలుస్తోంది.

Read Also: వైజాగ్ లో వరల్డ్ కప్ మ్యాచ్ లు… షెడ్యూల్ ఇదే!.. ఆంధ్రానా మజాకా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button