క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సికింద్రాబాద్ వారాసిగూడలో హృదయ విదారకర ఘటన వెలుగులోకి వచ్చింది. దహన సంస్కారానికి డబ్బుల్లేక ఇద్దరు అక్కాచెలెల్లు తల్లి శవాన్ని ఇంట్లోనే పెట్టుకున్నారు. ఓ గదిలో తల్లి మృతదేహం ఉండగా.. మరో గదిలో వారిద్దరూ 9 రోజుల పాటు గడిపారు. ఆహారం లేకుండా నీరసించి కుంగిపోయారు. తల్లి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించారు. చివరకు స్థానికులకు విషయం చెప్పటంతో ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగం చేసే రాజు అనే వ్యక్తితో లలిత (45)కు 26 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు రవళిక (24), యశ్విత (22) కుమార్తెలు. భార్య భర్తల మధ్య గొడవలు తలెత్తటంతో.. రాజు 2020లో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. దీంతో లలిత ఇద్దరు పిల్లలను తన తల్లి అండతో పోషించింది.
Read Also : పన్ను చెల్లింపుదారులకు గుడ్న్యూస్.. రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్
పెద్ద కుమార్తె రవళిక ఓ బట్టల దుకాణంలో, యశ్విత ఈవెంట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ తల్లికి అండగా ఉండేవారు. గత ఆరు నెలల క్రితమే ఓయూ ప్రాంతం నుంచి బౌద్ధనగర్లోని అద్దె ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఇటీవల లలిత తల్లి మరణించింది. దీంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. పైగా ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవటంతో గత మూడు నెలలుగా అద్దె చెల్లించలేదు. జనవరి చివర్లో ఇల్లు ఖాళీ చేస్తామని ఇంటి ఓనర్ను రిక్వెస్ట్ చేశారు. అండగా ఉండాల్సిన భర్త ఎటో వెళ్లిపోవటం.. తల్లి మరణంతో బెంగ.. ఎదిగిన ఇద్దరు ఆడ పిల్లల పరిస్థితిని తలుచుకొని లలిత జనవరి 22న రాత్రి నిద్రలోనే ప్రాణాలు కోల్పోయింది. ఉన్నట్లుండి తల్లి చనిపోవడంతో కుమార్తెలిద్దరూ షాక్కు గురయ్యారు. తల్లి చనిపోయిన విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. వేదన అనుభవించారు. అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేక.. తినటానికి తిండిలేక తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
Also Read : మా అన్న చావుకి హైడ్రానే కారణం.. బిల్డర్లు సూసైడ్ చేసుకోవాల్సిందే!
సూసైడ్ చేసుకునేందుకు కూడా ప్రయత్నించారు. పదునైన వస్తువులతో ఇద్దరూ గొంతు, మణికట్టుపై కోసుకున్నారు. తొమ్మిది రోజులుగా ఒక గదిలో తల్లి శవాన్ని ఉంచి, మరో గదిలో బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. ఇంటి ఓనర్ రెండుసార్లు వారి వద్దకు వెళ్లినా.. విషయం చెప్పకుండా దాటవేశారు. తల్లి శవం కుల్లిపోయి దుర్వాసన వస్తుండటంతో భరించలేక శుక్రవారం (జనవరి 31న) ఇంట్లో నుంచి బయటకు వచ్చి చుట్టుపక్కల వారికి విషయం తెలిపారు. వారు పోలీసులకు సమాచారమివ్వగా.. క్లూస్టీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ తరలించారు. అంబర్పేట్లో ఉన్న లలిత తమ్ముడికి సమాచారమిచ్చి అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ఒప్పంచారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. తల్లి మృతిపై కూతుళ్లిద్దరూ పొంతనలేని సమాధానం చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. లలిత మరణంలో వారు ఇంకా షాక్లోనే ఉన్నారని.. మానసికంగా కుంగిపోయారని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
- రేవంత్ పై 10 ఎమ్మెల్యేల తిరుగుబాటు?ఫాంహౌజ్లో సీక్రెట్ మీటింగ్
- టిడిపి కార్యాలయం పై దాడులు చేయడం మా తప్పే: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
- అలా చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు.. వాహనదారులకు మంత్రి పొన్నం వార్నింగ్
- టీజీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తం.. పోలీసుల అత్యుత్సాహం, సాధారణ ప్రజలను సైతం అదుపులోకి !!
- కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్