
-
బైక్పై వెళ్తున్న భర్తను కారుతో ఢీకొట్టించిన భార్య
-
మొదట రోడ్డుప్రమాదంగా చిత్రీకరణ
-
విచారణలో బయటపడ్డ సంచలన నిజాలు
-
కారు రెంట్కు తీసుకొని చంపించినట్లు గుర్తింపు
-
నిందితురాలు, సుఫారీ కిల్లర్స్ అరెస్ట్
-
వివాహేతర సంబంధమే హత్యకు కారణం
క్రైమ్ మిర్రర్, నల్గొండ: సొంత భర్తను సినీ ఫక్కీలో చంపించిన ఘటన ఉమ్మడి నల్గొండ జిల్లాలో కలకలం సృష్టించింది. యాదాద్రి భువనగిరి జిల్లా కాటేపల్లి వద్ద రోడ్డుప్రమాదంలో యువకుడు స్వామి దుర్మరణం పాలయ్యాడు. బైక్ను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావించారు. రోడ్డుప్రమాదంగా కేసు నమోదు చేశారు పోలీసులు.
అయితే, ఈకేసును అనుమానాస్పదంగా భావించి… హత్యకోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్వామి భార్యపై అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. దీంట్లో భాగంగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. స్వామి భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రియుడితో కలిసి స్వామి హత్యకు భార్యే పథకం రచించినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు ఉపయోగించిన కారును భార్యే రెంట్కు తీసుకొని, సుఫారీ కిల్లర్స్తో ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్థారించారు.