
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు 88 వ జయంతి వేడుకలను సూరారం గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు చల్ల రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..
సర్పంచ్ స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి, శాసనసభ్యుడిగా, శాసన సభాదిపతిగా పదవి చేపట్టి ఆ పదవికే వన్నె తెచ్చారని, రాష్ట్రానికి ఎనలేని సేవచేశారని గుర్తు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో అజాత శత్రవుగా పేరుగాంచారన్నారు. ఈ వేడుకల్లో గ్రామంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
1.క్షణికావేశంలో ఆత్మహత్యలు వద్దు :బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కిరణ్
2.తెలంగాణ రాజకీయాల్లో వీహెచ్ మార్క్ – మున్నూరు కాపులంతా ఏకమయ్యారా?