Wednesday, March 18, 2026
Homeతెలంగాణయూరియా టోకెన్ల కోసం రైతులు ధర్నా

యూరియా టోకెన్ల కోసం రైతులు ధర్నా

నూతనకల్ ( క్రైమ్ మిర్రర్) :యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఒక యూరియా బస్తా కోసం రాత్రంతా పిఏసీఎస్ వద్ద పడిగాపులు కాసిన యూరియా బస్తా దొరకకపోవడంతో అన్నదాతలు ఆగ్రహించారు. బుధవారం టోకెన్ల కోసం నిల్చున్న రైతులకు నిరాశ ఎదురవడంతో మరోసారి సూర్యాపేట దంతాలపల్లి ప్రధాన రహదారిపై కూర్చొని ధర్నాకు దిగారు. టోకెన్లు ఇచ్చి యూరియాను అందజేయకపోతే చావే చరణ్యమంటూ నినాదాలు చేశారు.

రైతులు ధర్నాకు చేస్తున్న సమయంలో వర్షం రావడంతో తడుస్తూ ధర్నాలు కొనసాగించారు. రైతుల ధర్నాతో వాహనాలు భారిగా రెండు వైపులా నిలిచిపోయాయి. ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియాను అందించి పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments