Homeతెలంగాణరైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు 'రైతుల అవగాహన కార్యక్రమం.. ముఖ్యఅతిథిగా ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు ‘రైతుల అవగాహన కార్యక్రమం.. ముఖ్యఅతిథిగా ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి

క్రైమ్ మిర్రర్, పరకాల:- పరకాల మండలంలోని వెంకటాపురం గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ రైతుల అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తక్కువ యూరియా వాడకం, సాగు ఖర్చును తగ్గించుట, అవసరం మేరకు రసాయనాలు వినియోగం, రైతు సోదరులకు రసీదులను భద్రపరుచుకోవడం, పంట మార్పిడి వలన కలిగే ప్రయోజనాలు, చెట్లను పెంచడం, సాగునీటిని ఆదా చేయడం వలన కలిగే ప్రయోజనాలు రైతులకు వివరించడం జరిగింది .వీటితో పాటుగా వెంకటాపూర్ గ్రామంలోని వివిధ పంటలలో సస్యరక్షణ చర్యల గురించి వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ బి. రాజు ,డాక్టర్ కే .స్వాతి, వ్యవసాయ విస్తరణాధికారులు కాటంరాజు, వ్యవసాయ కళాశాల వరంగల్ విద్యార్థులు, వెంకటాపూర్ గ్రామ రైతులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments