బంగారం, వెండి మార్కెట్లో ఈ వారంలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని రోజులుగా ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. మొత్తం వారపు ట్రెండ్ పరిశీలిస్తే, బంగారం ధరల్లో కొంత పెరుగుదల కనిపించింది.
హైదరాబాద్లో మార్చి 29న 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,48,090 వద్ద ఉండగా, ఏప్రిల్ 4 నాటికి ఇది రూ.1,50,930కు చేరింది. అంటే వారం రోజులలో రూ.2,840 పెరిగినట్లు చెప్పవచ్చు. 22 క్యారెట్ల బంగారం ధర మార్చి 29న రూ.1,35,750 వద్ద ఉండగా, శనివారం వరకు రూ.1,38,350కు చేరింది. ఈ వారం మొత్తం రూ.2,600 పెరుగుదల నమోదైంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం మార్చి 29న రూ.1,49,020 వద్ద ట్రేడవుతూ, ఏప్రిల్ 4న రూ.1,52,180కు పెరిగింది. అంటే మొత్తం రూ.3,160 విలువ పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర మార్చి 29న రూ.1,36,600 నుంచి రూ.1,39,500కు చేరింది, అంటే రూ.2,900 పెరుగుదల.
ఢిల్లీ మార్కెట్లో మార్చి 29న 24 క్యారెట్ల బంగారం రూ.1,48,220 వద్ద ఉండగా, ఏప్రిల్ 4 నాటికి రూ.1,51,080కు చేరింది. మొత్తం రూ.2,960 పెరుగుదల. 22 క్యారెట్ల బంగారం మార్చి 29న రూ.1,35,900 నుంచి ఏప్రిల్ 4న రూ.1,38,500కు చేరింది.
అటు ఆదివారం గోల్డ్ రేట్లు స్ధిరంగా ఉన్నాయి. వారం రోజుల పెరుగుదలకు బ్రేక్ పడింది. నేడు 24 క్యారెట్ల బంగారం రూ.1,50,930 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారెట్ల బంగారం రూ.1,38,350 వద్ద ఉంది. వెండి ధరల్లో కూడా పెద్ద మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో కిలో వెండి రేటు రూ.2,55,000 వద్ద ట్రేడవుతోంది.
ALSO READ: విద్యుత్ కేంద్రాలపై దాడి జరిగితే విధ్వంసమే: ఇరాన్
