
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, మాడుగులపల్లి::- రోడ్లకు ఇరువైపులా దట్టమైన కంపచెట్లు ఏపుగా పెరిగాయి. దీంతో రైతులకు, వాహనదారులకు అసౌకర్యంగా మారింది. స్థానికులు పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తమ గోడును వెల్లబోసుకున్న ఫలితం లేకపోయింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు కంపచెట్లు తొలగించక నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెళ్లవెత్తుతున్నాయి. ఇక పూర్తి వివరాలులోకెళితే.. నల్గొండ జిల్లా, మాడుగులపల్లి మండలము, పాములపహాడ్ గ్రామపంచాయతీకీ అనుసంధానమైన పలు రోడ్లకు ఇరువైపులా దట్టమైన కంప చెట్లు ఏపుగా పెరిగి రోడ్లను కమ్మేస్తున్నాయి. గ్రామం నల్ల చెరువు కట్ట నుండి బిరెల్లిగూడెం గ్రామం వరకు, పాములపహాడ్ నుండి కొప్పోలు రోడ్డుకు, ఆర్లగడ్డ రోడ్డుకు, పాములపహాడ్ నుండి భీమవరం రోడ్లకు దట్టమైన కంప చెట్లు పెరిగి మరో వాహనం ఎదురుగా వచ్చినప్పుడు రోడ్డు పక్కకు వెళ్లలేని పరిస్థితి ఎదురవుతోంది. మలుపుల వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలు కనబడడం లేదు. దీంతో ప్రమాదాలకు ఆస్కారం కలుగుతోంది. బీరెల్లిగూడెం నుంచి పాములపహాడ్ గ్రామానికి వెళ్లి చెరువు కట్ట దారిలో కంపచెట్లు రోడ్డుకు ఇరువైపులా ద్విచక్రవాహనం కూడా వెళ్లలేని విధంగా ఏపుగా పెరిగాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి కంపచెట్లు తొలగించి ప్రమాదాలు నివారించాలని స్థానికులు కోరుతున్నారు…
“హైడ్రా” దృష్టి పెట్టాలి – అసైన్డ్ భూములపై మళ్లీ ప్రజల డిమాండ్
ఇందుర్తి మేటిచందాపురంలో గ్రామ బొడ్రాయి తృతీయ వార్షికోత్సవం ఘనంగా ప్రారంభం