తెలంగాణ

ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి:- గోల్కొండ కిరణ్

క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్:- గత తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం పై దుష్ప్రచారాలు చేస్తున్న నాయకులు బ్యారేజ్ సందర్శనకు వచ్చే పర్యాటకులకు మార్గదర్శకాలు సూచించాలని మరియు ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్ అన్నారు. గత శనివారం మేడిగడ్డ గోదావరిలో జరిగిన ప్రమాదానికి విచారణ వ్యక్తం చేసిన కిరణ్ ప్రమాదంలో మరణించిన యువకుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ మెడిగడ్డ గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రమాద హెచ్చరిక బోర్డు లేకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిపై మంత్రి శ్రీధర్ బాబు వెంటనే స్పందించి బ్యారేజ్ సందర్శనకు వచ్చే పర్యాటకులకు మార్గదర్శకాలు సూచించే వారిని నియమించి ప్రమాదాలను అరికట్టాలని అన్నారు లేనిపక్షంలో టిఆర్ఎస్ తరఫున నిరసనలు తప్పవని హెచ్చరించారు.

అమెరికాలో ఆందోళనల కల్లోలం, లాస్ ఏంజిల్స్‎లో నిరసన జ్వాలలు!

మావోయిస్టుల దుశ్చర్య, బాంబుదాడిలో ఏఏస్పీ మృతి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button