తెలంగాణ

వాహనాల తనిఖీ చేపట్టిన ఎస్సై భూమేష్.. ధ్రువపత్రాలు లేని వాహనాలు సీజ్

రామకృష్ణాపూర్,క్రైమ్ మిర్రర్:- రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యాతనపల్లి అండర్‌బ్రిడ్జి వద్ద ఎస్సై భూమేష్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువ పత్రాలులేని 4 ద్విచక్ర వాహనాలు, 1 కార్ ను పోలీసులు సీజ్ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహన పరిమితులకు మించి అతివేగంగా వెళ్లడం ప్రమాదాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రాంగ్ రూట్‌లో వాహనాలు నడపడం చట్ట విరుద్ధమని ఎస్సై తెలిపారు.

Read also : కనుమరుగు కానున్న కరెంట్ తీగలు.. ఇక మీ ఇంటికి వైర్‌లెస్ విద్యుత్!

Read also : ఒంటరితనం భరించలేక వృద్ధుడి ఆత్మహత్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button