Homeక్రైమ్Crime: ఐస్‌క్రీం ఇచ్చి ముగ్గురు పిల్లలపై అత్యాచారం

Crime: ఐస్‌క్రీం ఇచ్చి ముగ్గురు పిల్లలపై అత్యాచారం

Crime: ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లా కలిమెల సమితిలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు బయట ఆడుకుంటున్న సమయంలో, అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వారికి ఐస్ క్రీం ఇస్తానని చెప్పి తన ఇంటికి తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అమాయకంగా అతని వెంట వెళ్లిన చిన్నారులను లైంగికంగా దాడి చేసి, ఈ విషయం ఎవరికి చెప్పొద్దని బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇంటికి చేరుకున్న చిన్నారుల ప్రవర్తనలో మార్పు గమనించిన కుటుంబ సభ్యులు వివరాలు అడగగా, భయంతో వారు జరిగిన విషయాన్ని వెల్లడించారు. దీంతో వెంటనే చిన్నారుల తల్లిదండ్రులు మంగళవారం ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ చిన్నారుల వయస్సు 9 సంవత్సరాల లోపే ఉండటంతో ఘటన మరింత బాధాకరంగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ALSO READ: True love stories: పోలీస్‌స్టేషన్‌లో ఒక్కటైన ‘మూగ’ జంట

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు