Wednesday, March 4, 2026
Homeఆంధ్ర ప్రదేశ్CRIME: ఓర్నీ దుంపతెగ.. పిన్నీసుతో 11 బైక్‌లో చోరీ చేశాడు..!

CRIME: ఓర్నీ దుంపతెగ.. పిన్నీసుతో 11 బైక్‌లో చోరీ చేశాడు..!

CRIME: ప్రకాశం జిల్లా పుల్లలచెరువులో ఇటీవల సంచలనమైన దొంగతనం చోటుచేసుకుంది. ఒక 20 ఏళ్ల యువకుడు, ఒక్క పిన్నీస్ ఉపయోగించి 11 మోటార్ సైకిళ్లను చోరీ చేయడం స్థానికులను ఆశ్చర్యంలో ముంచిపెట్టింది. వేణు అనే ఈ యువకుడు త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో, తన నైపుణ్యాన్ని వినియోగించి పుల్లలచెరువు పట్టణంలోని మోటార్ సైకిళ్లను తన మాయాజాలంతో దొంగిలించాడు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గత నెల 29వ తేది సాయంత్రం లక్ష్మా నాయక్ అనే వాహనదారుడు తన బైక్‌ను ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిలిపి, పని కోసం బయటకు వెళ్ళాడు. తిరిగి బైక్ కోసం వచ్చినప్పుడు అది దొంగిలింపబడిందని గమనించి, వెంటనే పుల్లలచెరువు ఎస్సై సంపత్‌ను సంప్రదించి ఫిర్యాదు నమోదు చేశాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, సక్రమంగా నిఘా పెట్టి చివరకు చొప్పరపు వేణు, చొప్పరపు సన్నీ అనే ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.

పోలీసులు వేణును డెమో కోసం పిలిపించి బైక్‌ను ఒక్క పిన్నీస్‌తో స్టార్ట్ చేయడం ఎలా సాధ్యమైంది అనే విషయం చూపించారు. ఈ లైవ్ డెమో చూసి పోలీసులే ఆశ్చర్యానికి గురయ్యారు. తాళం వేసి ఉంచిన బైక్ ను ఒక్క పిన్నీస్ సాయంతో సులభంగా స్టార్ట్ చేయగలిగిన యువకుడు.. తన తెలివి ద్వారా అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.

వీరు దొంగిలించిన 11 బైకుల మొత్తం విలువ సుమారు రూ.10 లక్షలు. పోలీసులు వాహనదారులకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. బైక్ లు బయట ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని, ఎలక్ట్రానిక్ లాక్‌లు, అలారాలు వాడాలని హెచ్చరిస్తున్నారు. ఈ సంఘటన, స్థానికులు, వాహనదారులకు భద్రతా చర్యలను పక్కాగా పాటించాలన్న గణనీయమైన పాఠాన్ని అందించింది.

ALSO READ: Good News: త్వరలోనే 40 వేల ఉద్యోగాలు..

RELATED ARTICLES

Most Popular

Recent Comments