Tuesday, February 24, 2026
Homeక్రైమ్గుట్టు చప్పుడు కాకుండా మహిళలతో వ్యభిచారం చేస్తూ.. చివరికి!

గుట్టు చప్పుడు కాకుండా మహిళలతో వ్యభిచారం చేస్తూ.. చివరికి!

వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్మగూడ ప్రాంతంలో చోటుచేసుకున్న వ్యభిచార గృహం వ్యవహారం నగరంలో కలకలం రేపింది. కమ్మగూడలో ఉన్న హర్షిత గెస్ట్ హౌస్‌ను కేంద్రంగా చేసుకుని అక్రమ వ్యభిచార కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న నమ్మదగిన సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందుగా అవసరమైన సెర్చ్ పర్మిషన్ తీసుకున్న వనస్థలిపురం పోలీసులు బుధవారం రాత్రి గెస్ట్ హౌస్‌పై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గెస్ట్ హౌస్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో కేసు నమోదు చేశారు.

పోలీసులు గెస్ట్ హౌస్‌లో తనిఖీలు నిర్వహించగా అక్కడ ఇద్దరు మహిళలు, ఒక రిసెప్షనిస్టు ఉన్నట్లు గుర్తించారు. విచారణలో బాధిత మహిళలు ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా తేలింది. వారిని తక్షణమే సురక్షితంగా రెస్క్యూ హోమ్‌కు తరలించి, కౌన్సెలింగ్ ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ కార్యకలాపాల్లో భాగంగా రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న మచిలీపట్టణానికి చెందిన షేక్ ఖలీల్ తండ్రి ఇస్మాయిల్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

ఈ వ్యవహారంలో ప్రధాన నిర్వాహకుడిగా గుర్తించిన ఆదిత్య చౌదరి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. గెస్ట్ హౌస్‌ను అడ్డాగా చేసుకుని చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే ఎవరినీ ఉపేక్షించబోమని, నిందితులపై కఠిన చర్యలు తప్పవని సీఐ మహేష్ గౌడ్ హెచ్చరించారు. నగరంలో ఇటువంటి అక్రమ దందాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా నిరంతర నిఘా కొనసాగిస్తామని తెలిపారు.

ఈ ఘటనతో మహిళల భద్రత, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వనస్థలిపురం పోలీసులు చేపట్టిన ఈ దాడులు అక్రమ వ్యభిచార దందాలకు గట్టి హెచ్చరికగా మారాయని స్థానికులు చెబుతున్నారు.

ALSO READ: మహిళతో సహజీవనం.. చంపి ఇంట్లో పూడ్చిపెట్టాడు

RELATED ARTICLES

Most Popular

Recent Comments