రామకృష్ణపూర్,క్రైమ్ మిర్రర్:పట్టణంలో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకే విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష ప్రారంభానికి ముందు సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి హాల్ టికెట్లు పరిశీలించిన అనంతరం హాలుల్లోకి అనుమతించారు.

పట్టణంలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, మొత్తం 289 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల ఆధ్వర్యంలో కేంద్రాల వద్ద భద్రతా చర్యలు చేపట్టి పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 అమలు చేశారు.
