
ఎల్బీనగర్, క్రైమ్ మిర్రర్:-రాబోయే మామిడికాయల సీజన్ లో రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి అన్నారు. బాటసింగారం పండ్ల మార్కెట్ లో మామిడి దిగుమతులు వస్తున్న నేపథ్యంలో సోమవారం కార్యాలయం ఆవరణలో మామిడి వ్యాపారస్తులు, సంబంధిత అధికారులు, మార్కెట్ సిబ్బంది, పాలకవర్గ సభ్యులతో కలిసి సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మామిడి కాయల వ్యాపారులు సీజన్ లో ఎదుర్కొంటున్న సమస్యలను, సలహాలను తెలియచేయడం జరిగిందని తెలిపారు. రైతులు వ్యాపారుల నుండి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గ్రామ సం’గ్రామం’లో స్థానిక పోరు… యువతదే తొలి మెట్టు
దేశంలోనే అతిపెద్ద మామిడి కాయల దిగుమతులు ఎగుమతులు బాటసింగారం పండ్ల మార్కెట్ లో జరుగుతున్నాయని, ఈ సంవత్సరం ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. కనీస వసతులు కలిపిస్తామని, రైతులకు విశ్రాంతి, వైద్య సేవలు, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, వంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. ఎప్పడు లేని విధంగా ముందస్తు జాగ్రత్తలు చేపడతామని అన్నారు. గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఒక కుటుంబంలా ఉండి ఎక్కడ సమస్య ఉన్న దగ్గరుండి పరిష్కరిస్తామని అన్నారు. అధిక కమీషన్లు వసూలు చేస్తే మార్కెట్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల పోరు – ఒంటరైన చంద్రబాబు..!
ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్మెట్ సీఐ అంజిరెడ్డి, ట్రాఫిక్ సీఐ గట్టుమల్లు, ఫైర్ స్టేషన్ సీఐ యాదగిరి, మార్కెట్ వైస్ చైర్మన్ సీహెచ్.భాస్కరాచారి, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ సభ్యులు బండి మధుసూదన్ రావు, రఘుపతి రెడ్డి, పన్యాల జైపాల్ రెడ్డి, అంజయ్య, లక్ష్మి, నరసింహ, గోవర్ధన్ రెడ్డి, నవరాజ్, గణేశ్ నాయక్, మచ్చెందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు గుప్తా, ఇబ్రహీం, మార్కెట్ కమిటీ అధికారులు, వ్యాపారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వైసిపి కి ఎటువంటి సహాయం చేయకండి… సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డ వైసిపి!.. కౌంటర్స్ వేస్తున్న ఇరుపార్టీలు?