
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా మరియు ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ ఘనంగా ఇవాళ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సహనం కోల్పోవడంతో ఐసీసీ కఠిన చర్యలు విధించింది. ఆస్ట్రేలియా టీం నుండి అరంగేట్రం చేసిన కోన్ స్టాస్ అనే 19 ఏళ్ల కుర్రాడు విధ్వంస్కర బ్యాటింగ్ తో చల రేగుతున్న సందర్భంలో విరాట్ కోహ్లీ ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో ఆ 19 ఏళ్ల కుర్రాడు నడుస్తూ వెళుతుండగా అతని భుజాన్ని కోహ్లీ బలంగా ఢీకొట్టాడు.
BBL లో ఒకే ఓవర్ లో 4,4,4,4,4,4 కొట్టిన డకేట్!…
ఇక అనంతరం అతనితో వాగ్వాదానికి దిగగా ఉస్మాన్ ఖవాజా మరియు ఏంపేర్స్ కలుగచేసుకొని ఇద్దరినీ కంట్రోల్ చేశారు. ఇక కోన్ స్టాస్ ఆ తర్వాత వేసిన బుమ్రా ఓవర్లో ఒక సిక్స్ ఒక ఫోర్ బాది ఏకంగా 18 పరుగులు చేశాడు. అయితే ఆ యువ ఆటగాడి పట్ల కోహ్లీ వ్యవహరించిన తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే కోహ్లీ ఢీకొట్టాడని రికీ పాంటింగ్ కూడా చెప్పుకొచ్చాడు.
ఎయిర్టెల్ సేవలకు అంతరాయం!… అసహనానికి గురైన యూజర్లు?
ఇక ఈ ఘటన నేపథ్యంలోనే తాజాగా విరాట్ కోహ్లీపై ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఐసిసి నిబంధనల ప్రకారం లెవెల్ 1 లో భాగంగా నేరంగా పరిగణించబడితే 20% మ్యాచ్ ఫీజు కోత విధించడంతోపాటు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించారు. ఇలా నాలుగు డి మెరిట్ పాయింట్లు వస్తే ఆ ప్లేయర్ ను ఒక టెస్ట్ మ్యాచ్ లేదా రెండు ఓవర్లు మ్యాచ్ నిషేధం కింద విధిస్తారు. కాబట్టి ప్రస్తుతానికి కోహ్లీకి ఒక డి మెరిట్ పాయింట్ మాత్రమే విధించింది.