
క్రైమ్ మిర్రర్, శంకర్ పల్లి :- చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మండలంలోగల టంగటూరు గ్రామం వద్ద అర్ధరాత్రి గ్రామ బిజెపి లీడర్ బద్దం శంబ రెడ్డి మృతి చెందాడు. నిన్న అనగా ఏడవ తారీకు శుక్రవారం రోజున ఓదెల రైల్వే స్టేషన్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న ట్రాన్స్ఫారం వద్ద విద్యుత్ తగిలి మృతి చెందాడని పోలీస్లు తెలిపారని స్థానికులు తెలిపారు. కానీ కుటుంబ సభ్యులు గ్రామ వాస్తవ్యులు కరెంట్ షాక్ తగిలితే మాకు తెలియకుండానే బాడిని తీశారని వారు చెప్తున్నారు అలాగే కుటుంబ సభ్యులకు, గ్రామ సర్పంచ్ గాని ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బాడి ని పోస్టుమార్టం తరలించారు పంచనామాలేకుండా ఏ ఘటనకు ఓదెలు రైల్వే స్టేషన్ సినిమా డైరెక్టర్డైరెక్టర్ అశోక్ కుమార్ ప్రొడ్యూసర్ ప్రశాంత్ సత్య బాధ్యత వహించాలని వారు తెలిపారు.
ఇవి కూడా చదవండి
1.మహిళలు అత్యున్నత స్థాయికి ఎదిగే విధంగా పనిచేస్తాం : ఏపీ ముఖ్యమంత్రి
2.ఉమెన్స్ డే స్పెషల్… మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి!..