ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లల చదువులపై తల్లిదండ్రులపై వచ్చే ఆర్ధిక భారం తగ్గించడానికి ప్రత్యేకంగా ఆర్థిక సహాయ పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘తల్లికి వందనం’ పథకం కింద ప్రతి సంవత్సరం ప్రతీ తల్లిదండ్రికి రూ.15,000 ఆర్థిక సాయం ఇవ్వడం జరుగుతుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ స్కీమ్ను ‘అమ్మఒడి’ పేరుతో అమలు చేయగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీన్ని ‘తల్లికి వందనం’గా పునరనామకరణం చేసింది.
గత ఏడాది తొలి విడతగా రూ.15,000 తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడినట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది రెండో విడత జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని ఒక సభలో ఆయన.. “జూన్లోనే తల్లిదండ్రుల అకౌంట్లలో రూ.15,000 విడుదల చేస్తాం. ఎలాంటి కొతలు లేకుండా లబ్ధిదారులందరికీ అందిస్తుంది” అని స్పష్టం చేశారు.
ఈ పథకానికి అర్హతలు ఈ విధంగా ఉన్నాయి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాసి అయి ఉండాలి
విద్యార్థులు 1వ తరగతి నుంచి 12వ తరగతి మధ్య చదువుతూ ఉండాలి
విద్యార్థి వద్ద కనీసం 75 శాతం హాజరు ఉండాలి
విద్యార్థి తల్లికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి
దరఖాస్తు చేసుకోవడం కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించవచ్చు. స్కూల్స్, కాలేజీల నుంచి సేకరించిన డేటా ఆధారంగా లబ్ధిదారుల అకౌంట్లలో నేరుగా డబ్బులు జమ చేస్తారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షల కంటే తక్కువ ఉండాలి.
దరఖాస్తు చేసిన తర్వాత స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. స్టేటస్ తెలుసుకోవడానికి https://gswsnbm.ap.gov.in/NBM#!/ ApplicationStatusCheckP వెబ్సైట్లో వెళ్లి ఆధార్ నంబర్ ఆధారంగా స్టేటస్ తనిఖీ చేయవచ్చు.
ప్రస్తుతం దరఖాస్తులు ఆఫ్లైన్లో మాత్రమే తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే సదుపాయం ఇవ్వబడే అవకాశం ఉంది. పథకం కింద ప్రతి సంవత్సరం రూ.15,000 ఇవ్వబడుతుండగా, అందులో నుంచి రూ.2,000 పిల్లల మెయింటనెన్స్ ఖర్చుల కోసం కట్ చేసి, మిగతా రూ.13,000 విద్యార్థి తల్లి అకౌంట్లో జమ చేయబడుతుంది.
ఈ పథకం వల్ల స్కూల్స్, కాలేజీల్లో డ్రాఫౌట్స్ తగ్గడం, విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండటం, మరియు తల్లిదండ్రుల ఆర్థిక భారం తగ్గడం జరుగుతుంది. దీని ద్వారా విద్యార్థులు మధ్యలో చదువును ఆపకుండా కొనసాగించడానికి ప్రేరణ పొందుతున్నారు.
