జాతీయం

అంతరిక్ష చరిత్రలో సరికొత్త మైలురాయి..రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు

Axiom 4 mission: ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాన్షు శుక్లా అతరిక్షయాత్రపై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. యాక్సియం-4 మిషన్‌ భాగంగా ఆయన అమెరికా వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలోకి వెళ్లారు. సుమారు 14 రోజుల పాటు కొనసాగే ఈ యాత్రలో పలు రకాల పరిశోధనలు కొనసాగించనున్నారు. ఈ మిషన్ కు శుభాంశు కప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.

శుభాంశుకు రాష్ట్రపతి అభినందనలు

శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త  మైలురాయిని సృష్టించారని అభినందించారు. గ్రూప్‌ కెప్టెన్‌ శుభాన్షు శుక్షా భారత అంతరిక్ష చరిత్రలో కొత్త మైలురాయిని సృష్టించారన్న ఆమె..  దేశమంతా గర్విస్తోందన్నారు.  నాసా, ఇస్రో మధ్య భాగస్వామ్యాన్ని ప్రతిబింబించే యాక్సియం-4 మిషన్‌ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్టు పెట్టారు.

ప్రధాని మోడీ ప్రశంసలు

రాకేష్ శర్మ తర్వాత అంతరిక్ష యాత్ర చేసిన శుభాన్షు శుక్లా తన వెంట 140 కోట్ల మంది భారతీయుల ఆశలను మోసుకెళ్లారంటూ ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ మిషన్ సక్సెస్ కావాలని ఆయాన ఆకాంక్షించారు. శుభాన్షు అంతరిక్ష యాత్రపై భారత వాయుసేన సంతోషం వ్యక్తం చేసింది. అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడైన రాకేశ్‌ శర్మ.. శుభాన్షు శుక్లాతోపాటు యాక్సియం-4 మిషన్‌లో పాల్గొన్న వ్యోమగాములకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యోమగాములంతా ఈ యాత్రను ఆస్వాదించాలని, వీలైనంత ఎక్కువ సేపు అంతరిక్షం నుంచి ప్రపంచాన్ని చూడాలని చెప్పారు. శుభాన్షు శుక్షా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లడం గర్వకారణమన్నారు.

Read Also: రోదసిలోకి మరో భారతీయుడు.. ఇంతకీ ఎవరీ శుభాంశు శుక్లా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button